*ఇబ్రహీంపట్నంలో ఘనంగా వినాయక పూజలు - పాల్గొన్న కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి ఫణి* *ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15, (గళమ్ న్యూస్)* పశ్చిమ ఇబ్రహీంపట్నం బావి ప్రాంతంలో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగ అలాగే పలు వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుడి పూజా కార్యక్రమం సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో,ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి మణిరాజ్ అలియాస్ ఫణి హాజరయ్యారు.ఆయనతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ పలు కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి గణపతికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రావి ఫణి మాట్లాడుతూ..విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు,సన్మార్గాన్ని చూపించే ఆ సిద్ధి వినాయకుడు మీకు ఎల్లవేళలా మార్గదర్శకుడిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందంజ వేయాలని,రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా వర్ధిల్లాలని,సకల జనులు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ,ఇబ్రహీంపట్నం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు రావి ఫణి కి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం ప్రశాంతంగా,భక్తిభావంతో ముగిసింది.
*ఇబ్రహీంపట్నంలో ఘనంగా వినాయక పూజలు - పాల్గొన్న కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి ఫణి* *ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15, (గళమ్ న్యూస్)* పశ్చిమ ఇబ్రహీంపట్నం బావి ప్రాంతంలో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగ అలాగే పలు వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుడి పూజా కార్యక్రమం సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో,ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి మణిరాజ్ అలియాస్ ఫణి హాజరయ్యారు.ఆయనతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ పలు కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి గణపతికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రావి ఫణి మాట్లాడుతూ..విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు,సన్మార్గాన్ని చూపించే ఆ సిద్ధి వినాయకుడు మీకు ఎల్లవేళలా మార్గదర్శకుడిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందంజ వేయాలని,రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా వర్ధిల్లాలని,సకల జనులు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ,ఇబ్రహీంపట్నం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు రావి ఫణి కి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం ప్రశాంతంగా,భక్తిభావంతో ముగిసింది.
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పవిత్ర సంగమం వద్ద జల హారతికి హాజరైన భక్తులు పవిత్ర సంగమం వద్ద సందర్శికుల తాకిడి పండగ రోజు కావడంతో హారతి దర్శనకు భారీగా హాజరైన ప్రజలు హారతి దర్శించుకున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చైర్మన్ ను కోరిన భక్తులు మున్సిపల్ నిధులతో త్వరలో పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని చైర్మన్ హామీ వినాయక చవితి పండగ కావడంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద హారతి కు సందర్శకులు భారీగా హాజరయ్యారు. హారతి దర్శించుకుని పరవశించారు. హారతి దర్శనకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరై దర్శించుకున్నారు. ప్రజల మధ్య కూర్చొని పవిత్ర హారతి సందర్శించుకున్నారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు పాత సినిమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సందర్శకులు చైర్మన్ కు పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో,చీకట్లో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని, మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో అధికారులతో మాట్లాడి మున్సిపల్ నిధులతో పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పవిత్ర సంగమానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అప్సర్, కో- ఆప్షన్ సభ్యులు మహబూబ్ సుభాని, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.1
- మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.1
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...2
- ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.1
- మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..1
- జైనూర్లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1