Shuru
Apke Nagar Ki App…
నర్సాపూర్: రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు నర్సాపూర్ పట్టణంలోని పురపాలికలోగల 15 వార్డులలో అభివృద్ధికై మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని, పుర ఛైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్తో కలిసి రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పురపాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ నిధులు మంజూరు చేయడం పట్ల కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు
Sk report PRESS
నర్సాపూర్: రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు నర్సాపూర్ పట్టణంలోని పురపాలికలోగల 15 వార్డులలో అభివృద్ధికై మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని, పుర ఛైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్తో కలిసి రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పురపాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ నిధులు మంజూరు చేయడం పట్ల కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు
More news from Medak and nearby areas
- నర్సాపూర్ పట్టణంలోని పురపాలికలోగల 15 వార్డులలో అభివృద్ధికై మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని, పుర ఛైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్తో కలిసి రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పురపాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ నిధులు మంజూరు చేయడం పట్ల కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు1
- మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- నర్సాపూర్ మున్సిపాలిటీ నగరాభివృద్ధికి అభివృద్ధికి రూ.15కోట్లు *ప్రజల శ్రేయస్సే లక్ష్యం – ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలి* సంబరంగా ఇందిరమ్మ గృహప్రవేశాలు నారాయణపూర్ గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నర్సాపూర్ మున్సిపాలిటీ 04 ,6 వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నర్సాపూర్ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మంత్రివర్యులు మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మరియు మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ , మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజ యాదవ్ , గ్రంధాలయ చైర్మన్ చిలె మల సుహాసినిరెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి, మంత్రి పాల్గొన్నారు మొదటిగా నగర అభివృద్ధి పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీ లో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి తో మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు పర్యటనలో భాగంగా మంత్రి నర్సాపూర్ 04,,06 వ వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వార్డ్ (4th) దుద్దాల దుర్గమ్మ భర్త అశోక్ 6th వార్డు మహమ్మద్ షకీరా బేగం భర్త యూసఫ్ ఉద్దీన్ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం నారాయణపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సూచించారు. . మున్సిపాలిటీ నగరాభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం ఉంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు .ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని నమోదు పెంచుకోవాలని ఆ దిశలో జరిగే బడిబాట కార్యమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దారులు, జ1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్)లో చేరదలచిన వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజానన్ బిడ్కర్ గారిని లేదా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నంబర్లు: 9890476595, 7680092628.1
- కామారెడ్డి జిల్లా : *సకాలంలో గర్భిణీ కి ఏ నెగిటివ్ రక్తం అందజేత* *ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా పర్ష వెంకటరమణ* *మూడు రోజుల నుండి రక్తం దొరకక ఇబ్బందులు పడ్డ గర్భిణీ మహిళ* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ మహిళ రాజ్యలక్ష్మి (28) కి ఏ నెగిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ వారికి కావాల్సిన ఏ నెగటివ్ రక్తం దొరకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని గండిమాసానిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పర్ష వెంకటరమణ 28 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కొంత మందికి మాత్రమే ఉంటుందని,ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత వెంకటరమణను అభినందించడం జరిగింది,నిస్వార్ధంగా సేవ చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడిలాగా ఆదుకున్నాడు.. గతంలో కేసీఆర్ నా ఆటో ఫిట్నెస్ డబ్బులు మాఫీ చేశాడు రూ.35000 ఆటో ఫిట్నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే పోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించాను కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు నిన్న ఆర్టీసీ వాళ్ళతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా మీరు ఇస్తాను అన్న రూ.12 వేలు మాకొద్దు.. డిస్ట్రిక్ట్ ఆటో హైదరాబాద్ సిటీలోకి రాకుండా చేయండి చాలు రాహుల్ గాంధీ పెద్ద చోర్.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డిది కూడా రాను రాను మా బ్రతుకే అవుతుంది.. ఆయనని ప్రజలు రాళ్లతో కొడతారు రాగానే కంచెలు బద్దలు కొట్టాము మీరు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పాడు.. ఇప్పుడు ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్తున్నారు - హైదరాబాద్ ఆటో డ్రైవర్1
- కర్నూలు జిల్లా వెల్దుర్తి లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం లోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకులు చుట్టూ తిరుగామని అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజల్ ఎక్కడా దొరకడం లేదని పరిస్థితిని వెంటనే చక్కనిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.1