Shuru
Apke Nagar Ki App…
కాగజ్నగర్లో హనుమాన్ శోభాయాత్ర రూట్ పరిశీలన........... కాగజ్నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం డీఎస్పీ వహీదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ కలిసి శోభాయాత్ర రూట్ను పరిశీలించారు. హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర రాజీవ్ గాంధీ చౌరస్తా, గాంధీ చౌక్, మెయిన్ మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా, తీరందాస్ టాకీస్ మీదుగా తిరిగి పలు ప్రధాన మార్గాల గుండా ఆలయానికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. పట్టణంలో పరిశుభ్రత చర్యలు కూడా చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు పాల్గొన్నారు.
Krishna
కాగజ్నగర్లో హనుమాన్ శోభాయాత్ర రూట్ పరిశీలన........... కాగజ్నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం డీఎస్పీ వహీదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ కలిసి శోభాయాత్ర రూట్ను పరిశీలించారు. హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర రాజీవ్ గాంధీ చౌరస్తా, గాంధీ చౌక్, మెయిన్ మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా, తీరందాస్ టాకీస్ మీదుగా తిరిగి పలు ప్రధాన మార్గాల గుండా ఆలయానికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. పట్టణంలో పరిశుభ్రత చర్యలు కూడా చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు పాల్గొన్నారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- హైదరాబాద్: శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ అండ్ టీ నుండి మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. మెట్రో రైలు స్వాధీనంపై సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తయిందని, మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.1
- రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న ₹1,100 కోట్లు సరిపోవడం లేదని సిర్పూర్ టి నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పేర్కొన్నారు. ఈ నిధులు సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ వంటి సామగ్రి కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో ప్రజలు విరాళాలు సేకరించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మంచిర్యాల ప్రాంతంలో అవసరాల కోసం వ్యాపారుల వద్ద నుంచి అప్పుగా వస్తువులు తెచ్చుకునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించి, తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం మ.2.30 గంటలకు జన్నారంతో పాటు పలు గ్రామాలలో 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఇది గత సంవత్సరం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు అలాగే దండేపల్లిలో 39, లక్షెట్టిపేటలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజల ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన, గ్రామీణ రోడ్లు జన సంచారం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి రావద్దని, వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.1
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ - 2026 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్రీడల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో గడిపే బొజ్జు పటేల్ క్రీడా మైదానంలో తనదైన శైలిలో ఆటలు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.1
- అసెంబ్లీ కమిటీ హాల్లో మానేర్ రివర్ ఫ్రంట్ పై కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.3
- Post by Solanke Ravi8
- కాగజ్నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం డీఎస్పీ వహీదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ కలిసి శోభాయాత్ర రూట్ను పరిశీలించారు. హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర రాజీవ్ గాంధీ చౌరస్తా, గాంధీ చౌక్, మెయిన్ మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా, తీరందాస్ టాకీస్ మీదుగా తిరిగి పలు ప్రధాన మార్గాల గుండా ఆలయానికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. పట్టణంలో పరిశుభ్రత చర్యలు కూడా చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు పాల్గొన్నారు.1