Shuru
Apke Nagar Ki App…
వంశధార, మహేంద్ర తనయపై వంతెనలు నిర్మించాలి.... ఎమ్మెల్యే ఎంజిఆర్ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను అసెంబ్లీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రస్తావించారు. వంశధార, మహేంద్ర తనయ నదులపై వంతెనలు నిర్మిస్తే ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతుందని తెలిపారు. గొట్టా బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా హిరమండలం వద్ద మరో వంతెన అవసరమని అన్నారు.
ANR
వంశధార, మహేంద్ర తనయపై వంతెనలు నిర్మించాలి.... ఎమ్మెల్యే ఎంజిఆర్ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను అసెంబ్లీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రస్తావించారు. వంశధార, మహేంద్ర తనయ నదులపై వంతెనలు నిర్మిస్తే ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతుందని తెలిపారు. గొట్టా బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా హిరమండలం వద్ద మరో వంతెన అవసరమని అన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు' ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 18, సంతబొమ్మాలి మండలం జామి మర్రిపాడు లో ఎల్లమ్మ తల్లి పూజలు బుధవారం నాడు ఘనంగా భక్తు నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా భక్తులు అమ్మవారిని దేవర్ను ఊరేగించి మరాటితో గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. దేవాలయం వద్ద భక్తులు విశేష పూజ నిర్వహించి పోతురాజు వద్ద మురాటలు సమర్పించారు.2
- టెక్కలికి 15 కోట్ల వ్యయంతో 50 పడగల ఆయుష్ హాస్పటల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ల చిత్రపటాలకు టిడిపి శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. టెక్కలి అన్నా క్యాంటీన్ జంక్షన్లో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ టెక్కలి అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చన్న నాయుడికి టెక్కలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.1
- Post by APPARAO KONCHADA1
- పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.1
- పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.1
- వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీఆర్ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.1
- వంశధార, మహేంద్ర తనయపై వంతెనలు నిర్మించాలి.... ఎమ్మెల్యే ఎంజిఆర్ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను అసెంబ్లీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రస్తావించారు. వంశధార, మహేంద్ర తనయ నదులపై వంతెనలు నిర్మిస్తే ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతుందని తెలిపారు. గొట్టా బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా హిరమండలం వద్ద మరో వంతెన అవసరమని అన్నారు.1