logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.

4 hrs ago
user_శాతవాహన కరీంనగర్
శాతవాహన కరీంనగర్
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
4 hrs ago

జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ* భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    1
    *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ*
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. 
పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.
బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    1
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • బండి సంజయ్‌ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు. కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం.. క్రెడిట్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఆరాటం.. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ కరీంనగర్‌ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ క్రెడిట్‌ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
    1
    బండి సంజయ్‌ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు.

కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం..

క్రెడిట్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఆరాటం..

బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ 

కరీంనగర్‌ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ క్రెడిట్‌ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    6 hrs ago
  • గుండ్లపల్లి స్టేజ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ......... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు "వందే మాతరం.. భారత్ మాతా కీ జై" అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గుండ్లపల్లి స్టేజ్  నుండి  ఘనంగా తిరంగా ర్యాలీ.........
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు "వందే మాతరం.. భారత్ మాతా కీ జై" అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • పాప బాధ్యత నాదే:మాజీ మంత్రి,BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల MLA KTR సిరిసిల్ల బి వై నగర్ కు చెందిన వెంకటేశం హత్యకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సిరిసిల్ల MLA KTR పరామర్శించి, వెంకటేష్ కూతురు చదువుకోవచ్చు కానీ భరిస్తానని హామీ ఇచ్చారు. రూ.3లక్షలు పిక్స్ డిపాజిట్ చేయించారు. భర్త కుటుంబానికి అండగా ఉండానని హామీ ఇచ్చారు. స్కూల్ హెడ్మాస్టర్ కు ఫోన్ చేసి పాప స్కూల్ నేనే కడతానంటూ, వారిని అడగద్దని సూచించారు.
    1
    పాప బాధ్యత నాదే:మాజీ మంత్రి,BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల MLA KTR      
సిరిసిల్ల బి వై నగర్ కు చెందిన వెంకటేశం హత్యకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సిరిసిల్ల MLA KTR పరామర్శించి, వెంకటేష్ కూతురు చదువుకోవచ్చు కానీ భరిస్తానని హామీ ఇచ్చారు. రూ.3లక్షలు పిక్స్ డిపాజిట్ చేయించారు. భర్త కుటుంబానికి అండగా ఉండానని హామీ ఇచ్చారు. స్కూల్ హెడ్మాస్టర్ కు ఫోన్ చేసి పాప స్కూల్ నేనే కడతానంటూ, వారిని అడగద్దని సూచించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    11 min ago
  • యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see
    1
    యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Bejjanki, Siddipet•
    9 hrs ago
  • కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్... టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి.. దాడిలో కుడి కన్నుకు గాయాలు... గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం.. విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం.. గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం.. స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.
    2
    కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్...

టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి..
దాడిలో కుడి కన్నుకు గాయాలు...
గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం..
విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం..
గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం..
స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • రామగుండం లో నలుగురు దొంగలు అరెస్టు...28 తులాల బంగారం ఏడు వేల నగదు స్వాధీనం పెద్దపల్లి జిల్లా రామగుండం మజీద్ కార్నర్ కు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7వేల స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తెలిపారు. ఈ మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి ముగ్గురు మైనర్లు, ఒక వ్యక్తి ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి, ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. ఇటీవల బసంత్ నగర్ లోని ఓ వైన్ షాప్ లో చోరీ చేసి పట్టుబడినట్లు తెలిపారు. కాగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని రామగుండం లో అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మైనర్లు కాగా ఒకరు మేజర్ ఉన్నారు. అయితే చిన్ననాటి నుండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.
    2
    రామగుండం లో నలుగురు దొంగలు అరెస్టు...28 తులాల బంగారం ఏడు వేల నగదు స్వాధీనం
పెద్దపల్లి జిల్లా రామగుండం మజీద్ కార్నర్ కు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7వేల స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తెలిపారు.
ఈ మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి ముగ్గురు మైనర్లు, ఒక వ్యక్తి ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు  పాల్పడ్డారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి, ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. ఇటీవల బసంత్ నగర్ లోని ఓ వైన్ షాప్ లో చోరీ చేసి పట్టుబడినట్లు తెలిపారు. కాగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని రామగుండం లో అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మైనర్లు కాగా ఒకరు మేజర్ ఉన్నారు. అయితే చిన్ననాటి నుండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    13 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.