Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నా, చాలా బంకుల్లో “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల కోసం డీజిల్ దొరకక ఇబ్బందులు పడుతుండగా, బైక్, కారు యజమానులు కూడా ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన కొరతతో రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్ష చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
V Ramarao
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నా, చాలా బంకుల్లో “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల కోసం డీజిల్ దొరకక ఇబ్బందులు పడుతుండగా, బైక్, కారు యజమానులు కూడా ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన కొరతతో రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్ష చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వేసవి డిమాండ్తో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు నష్టాలను చూసిన రైతులకు భారీ ఊరట దక్కింది. APలో నిమ్మకు ప్రసిద్ధిగాంచిన గూడూరు(నెల్లూరు) లో మొదటిరకం కాయలు రికార్డుస్థాయిలో కేజీకి రూ.210 పలుకుతున్నాయి. ఇవి కేజీకి 20-22 కాయలు వస్తాయి. ఇటీవల వర్షాలకు నిమ్మ పూత, పిందెలు రాలిపోయాయని లేకుంటే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. అటు TGలోని కరీంనగర్ లోనూ కేజీ రూ.200 పలుకుతోంది1
- అమరావతి:రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జన్మదిన వేడుకలు అమరావతి పట్టణ ప్రజలు సోమవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అమరావతి రాజధానిగా కృష్ణా,గుంటూరు ప్రాంతంలో పరిపాలించిన జమీందారు ప్రసిద్ధి పొందిన ప్రభువు రాజా వాసిరెడ్డి అని వక్తలు కొనియాడారు.కవి పండిత పోషకుడు,మంచి పరిపాలనా దక్షుడు,వందకు పైగా దేవాలయాలు నిర్మించిన ప్రభువు వాసిరెడ్డి అన్నారు.1
- Post by CHIYAAN1
- గుంటూరులో డీజిల్ కొరత గుంటూరులో కొన్నిచోట్ల డీజిల్ లేక ఆటోలు లైనులో నిల్చున్నాయి.వాహనదారులు కూడా లైన్లో బండ్లు పెట్టి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.మరోవైపు పెట్రోల్ డీజిల్ కొడతా తీర్చడానికి కలెక్టర్ నడుంబించారు.1
- Post by Meenakshi1
- *వరంగల్ జిల్లా :*నర్సంపేట పట్టణంలోని పలు పెట్రోల్ బంక్ ల వద్ద నోస్ర్టాక్ బోర్డులు పెట్టిన బంకుల యాజమాన్యాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంక్ ల వద్ద నిలిచిపోయి పడిగాపులు కాస్తు బారులుతీరిన వాహనదారులు.2
- తూగో జిల్లా నల్లజర్ల లో జాతీయ రహదారి పై డీజిల్ లేక రోడ్డుపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఒడిశా కు చెందిన కార్మికులు చేసేది ఏమి లేక రోడ్డు పై కూర్చున్న కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నుంచి రాజమండ్రి మొదలుకొని నల్లజర్ల వచ్చే సరికి డిజిల్ ఎక్కడ దొరక్కపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు. తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. నల్లజర్ల చుట్టుపక్కల 25 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా డిజిల్ అనేది లేకపోవడం తో ఎక్కడ వాహనాలు అక్కడే నిలుపుదల చేస్తున్న వాహనదారులు.1
- ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన 'ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిత్యం ఆదాయం ఇచ్చే పంటలు వేయాలని సూచించారు. ప్రకృతి పంటలు ఆరోగ్యానికి మేలని, వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ఆయన పేర్కొన్నారు.1
- - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ1