Shuru
Apke Nagar Ki App…
అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
Zakeer
అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.1
- అలంపూరు కాంగ్రెస్ నాయకులకు రాఖీలు కట్టిన తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) పురస్కరించుకుని_ *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, in ub మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గారు* _అలంపూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు_ *తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజర్ కమిటీ మాజీ మెంబర్ "మహమ్మద్ ఇస్మాయిల్", కౌన్సిలర్ "జమ్మన్న," నాయకులు "రజిని బాబు," "మద్దిలేటి," "సురేష్" కురాఖీలు కట్టి సోదరభావం చాటారు._ ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సరిత* *తిరుపతయ్యగారికి శుభాకాంక్షలు తెలిపారు.*1
- విద్యుత్ కోతల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇలా అయితే ఎలా ధరూర్: మండలంలోని నీలహల్లి గ్రామ సమీపంలో ఉన్న కె.టి.దొడ్డి మండలం పాతపాలెం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించాలని రైతుల కోరారు.1
- ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక1
- Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz4
- రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది. రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.1
- సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేలు , ఆగస్టు 27: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి. గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్మాల ప్రాజెక్టుకు సంబంధించిన క్రషర్ మిషన్, బ్లాస్టింగ్ కారణంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపన ల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతులు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.1