14వ తేదీన జాతీయ లోక్ అదాలత్* జిల్లాలో 11,602 కేసులు గుర్తింపు. జిల్లాలో 20 బెంచ్ లు ఏర్పాటు. శ్రీకాకుళం,మార్చి,12: జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్ లు ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలో 4 బెంచ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ కేసులను కక్షిదారులు రాజీ చేసుకోవచ్చన్నారు. సివిల్, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. *జాతీయ లోక్ అదాలత్ వలన ఉపయోగాలు* ఈ లోక్ అదాలత్ వలన సమయం, ధనం వృధా కాకుండా ఉంటుందని చెప్పారు. సివిల్ కేసులు రాజీ అయితే మొదట చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి చెల్లస్తామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న కక్షిదారులు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
14వ తేదీన జాతీయ లోక్ అదాలత్* జిల్లాలో 11,602 కేసులు గుర్తింపు. జిల్లాలో 20 బెంచ్ లు ఏర్పాటు. శ్రీకాకుళం,మార్చి,12: జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్ లు ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలో 4 బెంచ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ కేసులను కక్షిదారులు రాజీ చేసుకోవచ్చన్నారు. సివిల్, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. *జాతీయ లోక్ అదాలత్ వలన ఉపయోగాలు* ఈ లోక్ అదాలత్ వలన సమయం, ధనం వృధా కాకుండా ఉంటుందని చెప్పారు. సివిల్ కేసులు రాజీ అయితే మొదట చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి చెల్లస్తామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న కక్షిదారులు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.3
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.1
- పాతపట్నంలో తన క్యాంప్ కార్యాలయంలోఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాలలో త్రాగునీరు, రహదారులు విద్యుత్ తదితర సమస్యల పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతలు అందజేశారు. వెంటనే ఆయన స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.1
- పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్1
- Post by Rai Narendra1
- హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Shyam1
- Post by Rai Narendra1