logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేటీఆర్, హరీష్ రావు పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్...కోడి గుడ్డు మీద ఈకలు పీకే నాయకులుగా మారారని విమర్శ పచ్చి అబద్దాలకు కేరఫ్ అడ్రస్స్ కేటీఆర్, హరీష్ రావు లని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జగిత్యాల లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మా బిఆర్ఎస్ కు అధికారం మీద ఉన్న ఆశ తప్ప ప్రజల సమస్య మీద శ్రద్ద లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గుండు సున్నా అని విమర్శించారు. ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గడిచిన అన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కొరుకున్నారని తెలిపారు. తేజస్వి సూర్య మాటలను ఖండించింది మొదట మేమే అన్నారు. నాడు ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తల్లి బిడ్డల ను వేరు చేసేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ది ఫెవికల్ బంధమని విమర్శించారు. తెలంగాణ ను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

కేటీఆర్, హరీష్ రావు పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్...కోడి గుడ్డు మీద ఈకలు పీకే నాయకులుగా మారారని విమర్శ పచ్చి అబద్దాలకు కేరఫ్ అడ్రస్స్ కేటీఆర్, హరీష్ రావు లని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జగిత్యాల లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మా బిఆర్ఎస్ కు అధికారం మీద ఉన్న ఆశ తప్ప ప్రజల సమస్య మీద శ్రద్ద లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గుండు సున్నా అని విమర్శించారు. ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గడిచిన అన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు రేవంత్ ప్రభుత్వాన్ని కొరుకున్నారని తెలిపారు. తేజస్వి సూర్య మాటలను ఖండించింది మొదట మేమే అన్నారు. నాడు ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తల్లి బిడ్డల ను వేరు చేసేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ది ఫెవికల్ బంధమని విమర్శించారు. తెలంగాణ ను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులు వర్షం కురిసింది. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం, వడగళ్ల వాన ప్రజల్ని ఉక్కిరి బిక్కిరికి గురిచేసింది. జోరుగా కురిసిన వర్షం, పిడుగులతో ప్రజలు భయాందోళన చెందారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులు వర్షం కురిసింది. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై  పిడుగు పడింది. పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం, వడగళ్ల వాన ప్రజల్ని ఉక్కిరి బిక్కిరికి గురిచేసింది. జోరుగా కురిసిన వర్షం, పిడుగులతో ప్రజలు భయాందోళన చెందారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.
    1
    తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న  ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu
    2
    cm revanth reddy nasthurpally ki ravas
daniki erpatlu
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
    1
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య  ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్  హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    10 hrs ago
  • కరీంనగర్ లో బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. ముకరంపురలోని లక్కీబార్ సమీపంలో నివసించే రావత్ ఆకాష్ అనే యువకుడు ఓ భవనం పైనుంచి దూకేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అతడికి నచ్చజెప్పారు. తగిన భద్రతా చర్యలు చేపట్టి బిల్డింగ్ పై నుండి దూకకుండా కాపాడి కిందికి దింపారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.
    1
    కరీంనగర్ లో బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. ముకరంపురలోని లక్కీబార్ సమీపంలో నివసించే రావత్ ఆకాష్ అనే యువకుడు ఓ భవనం పైనుంచి దూకేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అతడికి నచ్చజెప్పారు. తగిన భద్రతా చర్యలు చేపట్టి బిల్డింగ్ పై నుండి దూకకుండా కాపాడి కిందికి దింపారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.