Shuru
Apke Nagar Ki App…
తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అవసరమైతే ప్రైవేట్ గోదాములను సైతం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, స్థానిక హమాలీలను వంద శాతం వినియోగించుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మెదక్ న్యూస్
తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అవసరమైతే ప్రైవేట్ గోదాములను సైతం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, స్థానిక హమాలీలను వంద శాతం వినియోగించుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
More news from Telangana and nearby areas
- ఒక కోటి 80 లక్షలు మిస్సాప్రాబ్లేషన్ చేసిన ఆదర్శ బ్యాంక్ మేనేజర్ యాదవ్ అనిల్ పై చీటింగ్ కేసు నమోదు డిఎస్పి ప్రసన్నకుమార్ బ్యాంకు ను మోసం చేసిన బ్యాంక్ మేనేజర్ యాదవ్ అనిల్ పై చీటింగ్ కేసు నమోదు డిఎస్పి ప్రసన్న కుమార్ వెల్లడి మెదక్ పట్టణంలో ఆదర్శ Co-operative అర్బన్ బ్యాంకు మెదక్ బ్రాంచ్ లో Rs 179.54 లక్షల మోసం కేసులో 3 నిందితులను పట్టుకోవడం జరిగింది ఈ కేసులో ప్రదాన నిందితుడు యాదం అనిల్ మెదక్ ఆదర్శ Co-operative అర్బన్ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తూ అతని బార్య,స్నేహుతులు మరియు ఇతరుల adhar, PAN card లు తీసుకుని ఆ పేపెర్ల మీద నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో లోన్ లు తీసుకోవడం జరిగింది. అలాగే 2 ATM ల నుండినగదు ని డిపాజిట్ చేసేటపుడు కొంత కొంత డబ్బులు పక్కన పెట్టి అలా సుమారు 31.35 లక్షలు నగదు ని కూడా మోస పూరితంగా బ్యాంకు ని మోసం చేసి వాడుకున్నాడు 2 వ నిందితుడు శ్రీనివాస చారి నకిలీ బంగారం ని తనికి చేసి, ఒరిజినల్ అని చెప్పి బ్యాంకు ని మోసం చేయడం లో ప్రధాన పాత్ర వహించాడు. 3యాదం అనిల్, నిందితుడు Subramanyam యాదం అనిల్ కి స్నేహితుడు. సుబ్రహ్మణ్యం & అతని భార్య ల యొక్క adhar PAN card లు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు 4 వ నిందితురాలు Yadam sravanthi yadam అనిల్ యొక్క బార్య. yadam అనిల్ స్రవంతి యొక్క adhar, PAN card లు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు గతంలో కూడా yadam అనిల్ ఆంధ్రప్రదేశ్ Velairpadu P.S పరిదిలో కూడా A.P. గ్రామీణ వికాస్ బ్యాంక్, Velairpadu మండల్ బ్రాంచ్ లో కూడా పోలవరం నిర్వాసితులని & గిరిజనులను మోసం చేసి Rs. 11,82,487/- డబ్బులు వాడుకుని జైలు కి పోయినాడు ప్రస్తుతం yadam Anil పరారిలో ఉన్నాడు మిగిలిన 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టు నందు హాజరు పరచడం జరిగింది1
- మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కన్నపేటకు చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. నవాబ్ ఇరానీ టీ పాయింట్ వద్ద జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు విచారణ చేపట్టారు.1
- **రవీంద్రభారతి మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమా *రవీంద్రభారతి @మస్కులర్* *డిస్ట్రోపి రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రవి కుమార్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు* మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ ఇంజూరి తో *బాధపడుతున్న వారీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది...... 👍ఆ సమస్యలు పరిష్కారం కి నేనే బాధ్యత తీసుకుంటాను* అని చెప్పడం జరిగింది స్త్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మస్కులర్ డిస్ట్రోపి, స్పైనల్ కార్డ్ *ఇంజూరి బాధితుల తల్లులకి* నగదు బహుమతి, చీర ను అందించి సన్మానం చేయడం తో పాటు వాళ్ళు చేస్తున్న సేవలకి *పాదాభివందనాలు* తెలియజేశాను2
- సికింద్రాబాద్లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్ద బోనాల గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చందనోత్సవం, పూజలు, యజ్ఞం నిర్వహించి, భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కౌన్సిలర్తో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.3
- సిద్దిపేటలోని కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, ఇన్ఛార్జుల నియామకంపై కేసీఆర్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించారు.1
- పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన * భారీగా తరలివచ్చిన భక్తులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.4
- తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మిషన్ మోడ్లో పనిచేయాలని, ప్రైవేట్ గోదాములను వినియోగించుకోవాలని ఆదేశించారు.1