logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు... ధర్నా ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.

10 hrs ago
user_Telangana news
Telangana news
మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
10 hrs ago

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు... ధర్నా ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
    1
    ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • Hyderabad Traffic Police #HyderabadTrafficPolice #CPRAwareness #SaveLives #RoadSafety #HyderabadNews #TrafficAwareness #HumanityFirst #EmergencyCare #HeartAttackHelp #PublicSafety #HyderabadPolice #LifeSavingSkills #CPRTraining #SafetyFirst #IndiaNews
    1
    Hyderabad Traffic Police
#HyderabadTrafficPolice #CPRAwareness #SaveLives #RoadSafety #HyderabadNews #TrafficAwareness #HumanityFirst #EmergencyCare #HeartAttackHelp #PublicSafety #HyderabadPolice #LifeSavingSkills #CPRTraining #SafetyFirst #IndiaNews
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కూడా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదాలు క్షణాల్లో జరుగుతాయని, అందుకే డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. హైవేలపై ఎల్లప్పుడూ ఎడమ వైపు ప్రయాణిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఓవర్‌టేక్ చేయాలని సూచించారు. రాత్రివేళల్లో లో-బీమ్ లైట్లు వినియోగించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ముందు-వెనుక సీట్లలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, “‘అరైవ్ అలైవ్’ అంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే కుటుంబానికి ఇచ్చే హామీ” అని భావోద్వేగపూరితంగా తెలిపారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు ప్రయాణించడం, అధిక లోడ్‌తో వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలను మానుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రమాదాల నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    4
    గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కూడా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదాలు క్షణాల్లో జరుగుతాయని, అందుకే డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. హైవేలపై ఎల్లప్పుడూ ఎడమ వైపు ప్రయాణిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఓవర్‌టేక్ చేయాలని సూచించారు. రాత్రివేళల్లో లో-బీమ్ లైట్లు వినియోగించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ముందు-వెనుక సీట్లలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు.
పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, “‘అరైవ్ అలైవ్’ అంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే కుటుంబానికి ఇచ్చే హామీ” అని భావోద్వేగపూరితంగా తెలిపారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు ప్రయాణించడం, అధిక లోడ్‌తో వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలను మానుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సదస్సు ద్వారా వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రమాదాల నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడానికి నిరసిస్తూ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ కు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
    1
    పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడానికి నిరసిస్తూ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ కు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    37 min ago
  • హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు
    1
    హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి
శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.
విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    45 min ago
  • వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.
    1
    వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    21 hrs ago
  • ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.
    1
    ఉప్పల్ రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. 2 నుండి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు సంవత్సరాలలో 140 శాతం, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 84 శాతం ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్కూల్ గేటు ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.