logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

2 hrs ago
user_MD. YOUSUF ALI KHAN
MD. YOUSUF ALI KHAN
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
2 hrs ago

మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

More news from తెలంగాణ and nearby areas
  • మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    1
    మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్ , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్  , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.
    1
    ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన
ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    1
    ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి
న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని
బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు.
వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్,  తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    8 hrs ago
  • ఖానాపూర్ నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు ఖానాపూర్ గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు
    1
    ఖానాపూర్       
   నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు 
ఖానాపూర్  గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు  తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా  తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.
    1
    శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు
రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు  సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్  తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు.
వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం  చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_Vsk
    Vsk
    Metpalli, Jagitial•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.