కరీంనగర్ జిల్లా తనుగులలో అదృశ్యమైన వ్యక్తి హత్య... తల్లి అక్క బావలే నిందితులని తేల్చిన పోలీసులు మద్యం మత్తులో నిత్యం కన్న తల్లిని వేధింపులకు గురి చేసి ఇటీవల అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తల్లితో పాటు అక్క బావ నే నిందితులను నిర్థారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబు వృత్తి రీత్యా సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే క్రమేణా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తుంటే మూడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. దీంతో కూలి పనిచేసుకొని జీవించే తల్లిని, అక్క బావతో మద్యం మత్తులో నిత్యం గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన తల్లి అక్క బావ మరో నలుగురితో కలిసి మంచానికి కట్టి ఉరి వేసి హత్య చేశారు. మృత దేహాన్ని తీసుకెళ్లి రాజబాబు వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టారు. అనంతరం పోలీసులకు రాజబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానాలు రావడంతో అదుపులో తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో తామే హత్య చేసి పూడ్చి పెట్టమని నిందితులు ఒప్పుకోవడం తో నిందితులను రాజబాబును పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కు తరలించారు. అయితే మద్యం సేవించి నిత్యం వేధించడమే హత్యకు గల కారణాలనీ పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపారు
కరీంనగర్ జిల్లా తనుగులలో అదృశ్యమైన వ్యక్తి హత్య... తల్లి అక్క బావలే నిందితులని తేల్చిన పోలీసులు మద్యం మత్తులో నిత్యం కన్న తల్లిని వేధింపులకు గురి చేసి ఇటీవల అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తల్లితో పాటు అక్క బావ నే నిందితులను నిర్థారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబు వృత్తి రీత్యా సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే క్రమేణా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తుంటే మూడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. దీంతో కూలి పనిచేసుకొని జీవించే తల్లిని, అక్క బావతో మద్యం మత్తులో నిత్యం గొడవ పడేవాడు. దీంతో విసుగు
చెందిన తల్లి అక్క బావ మరో నలుగురితో కలిసి మంచానికి కట్టి ఉరి వేసి హత్య చేశారు. మృత దేహాన్ని తీసుకెళ్లి రాజబాబు వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టారు. అనంతరం పోలీసులకు రాజబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానాలు రావడంతో అదుపులో తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో తామే హత్య చేసి పూడ్చి పెట్టమని నిందితులు ఒప్పుకోవడం తో నిందితులను రాజబాబును పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కు తరలించారు. అయితే మద్యం సేవించి నిత్యం వేధించడమే హత్యకు గల కారణాలనీ పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపారు
- కరీంనగర్లో దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్తో పాటు పలువురు ముఖ్య నేతలు పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేటర్లు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య అందించిన సేవలను నాయకులు, కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. ఆయన ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.4
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు1
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- కరీంనగర్ జిల్లా తనుగులలో అదృశ్యమైన వ్యక్తి హత్య... తల్లి అక్క బావలే నిందితులని తేల్చిన పోలీసులు మద్యం మత్తులో నిత్యం కన్న తల్లిని వేధింపులకు గురి చేసి ఇటీవల అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తల్లితో పాటు అక్క బావ నే నిందితులను నిర్థారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబు వృత్తి రీత్యా సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే క్రమేణా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తుంటే మూడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. దీంతో కూలి పనిచేసుకొని జీవించే తల్లిని, అక్క బావతో మద్యం మత్తులో నిత్యం గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన తల్లి అక్క బావ మరో నలుగురితో కలిసి మంచానికి కట్టి ఉరి వేసి హత్య చేశారు. మృత దేహాన్ని తీసుకెళ్లి రాజబాబు వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టారు. అనంతరం పోలీసులకు రాజబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానాలు రావడంతో అదుపులో తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో తామే హత్య చేసి పూడ్చి పెట్టమని నిందితులు ఒప్పుకోవడం తో నిందితులను రాజబాబును పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కు తరలించారు. అయితే మద్యం సేవించి నిత్యం వేధించడమే హత్యకు గల కారణాలనీ పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపారు2
- కరీంనగర్ నగర పాలక సంస్థలో వాటర్ పైప్లైన్ టెండర్ నిబంధనలపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా... కేవలం పైపుల తయారీ సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఇదే పైప్లైన్ పనికి గతంలో 45 లక్షల రూపాయల టెండర్ నిర్వహించగా... దాదాపు 28 శాతం లెస్కు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు సుమారు 12 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. అయితే ఇప్పుడు అదే పనికి సంబంధించిన టెండర్ నిబంధనలను ఉన్నట్టుండి ఎందుకు మార్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధనల మార్పు వెనుక ఎవరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందో స్పష్టం చేయాలని కోరారు. మేయర్, కమిషనర్కు ఈ నిబంధనల మార్పు గురించి తెలుసా..? తెలియకుండానే జరిగిందా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా పారదర్శకంగా టెండర్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1
- ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి *భూములు నిషేధిత జాబితాలో తీస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు* ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి *భూములు నిషేధిత జాబితాలో తీస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు* తీయకపోతే అమాయకుల భూమి నిషేధిత జాబితాలో పెట్టారు అంటారు మరి నేను ఏం చేయాలి బాయిలో దూకాలా? – రేవంత్ రెడ్డి1