logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం కరీంనగర్...... కరీంనగర్: డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఆర్టీసీ బస్సు స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
12 hrs ago

కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం కరీంనగర్...... కరీంనగర్: డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఆర్టీసీ బస్సు స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. పలుచోట్ల అద్దె బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రతకు దారి తీసింది. అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వేకువజాము నుంచే ఆర్టీసి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన ఉద్యోగులు డిపోల ముందు నిరసన ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9 గంటల వరకు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 920 బస్సులు ఉండగా 450 బస్సులు నడిచాయని అధికారులు ప్రకటించారు. 414 అద్దె బస్సులతోపాటు 36 ఆర్టీసీ బస్సులు నడిచాయని తెలిపారు. సమ్మేలో 3236 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అద్దె బస్సులో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించి బస్సులు నడిపించడాన్ని నిరసిస్తూ ఆర్టిసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెతో పూర్తి స్థాయిలో బస్సులు నడవక, ఆరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల సమస్య సత్వరమే పరిష్కరించి ప్రయాణీకుల ఇక్కట్లను తొలగించాలని ప్రయాణీకులు కోరారు.
    4
    ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. పలుచోట్ల అద్దె బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రతకు దారి తీసింది.
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వేకువజాము నుంచే ఆర్టీసి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన ఉద్యోగులు డిపోల ముందు నిరసన ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9 గంటల వరకు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 920 బస్సులు ఉండగా 450 బస్సులు నడిచాయని అధికారులు ప్రకటించారు. 414 అద్దె బస్సులతోపాటు 36 ఆర్టీసీ బస్సులు నడిచాయని తెలిపారు. సమ్మేలో 3236 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.  అద్దె బస్సులో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించి బస్సులు నడిపించడాన్ని నిరసిస్తూ ఆర్టిసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెతో పూర్తి స్థాయిలో బస్సులు నడవక, ఆరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల సమస్య సత్వరమే పరిష్కరించి ప్రయాణీకుల ఇక్కట్లను తొలగించాలని ప్రయాణీకులు కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా సిరిసిల్లలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా డిపో గేటు ముందు నిరసన తెలిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టారు.
    2
    రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా సిరిసిల్లలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా డిపో గేటు ముందు నిరసన తెలిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...* జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    2
    *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...*
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక  కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదివాసుల విద్యా, సాంస్కృతిక సందర్శన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బయల్దేరి వెళ్లారు. బుధవారం హైదరాబాదులో ఆదివాసుల కోసం విద్య, సాంస్కృతిక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యమైన జన్నారం మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం బస్సులలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
    1
    ఆదివాసుల విద్యా, సాంస్కృతిక సందర్శన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బయల్దేరి వెళ్లారు. బుధవారం హైదరాబాదులో ఆదివాసుల కోసం విద్య, సాంస్కృతిక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యమైన జన్నారం మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం బస్సులలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    40 min ago
  • వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
    1
    వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్...... కరీంనగర్: డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఆర్టీసీ బస్సు స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    2
    కరీంనగర్......
కరీంనగర్: డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఆర్టీసీ బస్సు స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఇటుక బట్టీలలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన పై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేశారు. కుక్కల బెడద నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటుక బట్టిలో మృతి వివరాలను బాలిక తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఇటుక బట్టీల్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయం అందించడం జరుగుతుందని, దాడికి సంబంధించిన వివరాల నివేదికను జిల్లా జడ్జికి పంపించడం జరుగుతుందని జడ్జి గణేశ్ తెలిపారు. అలాగే చిన్నారి మృతికి కారణమైన వీధి కుక్కలపై మరియు వాటిని ప్రేరేపించే జంతు ప్రేమికులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటుక బట్టీలలో సరైన సెక్యూరిటీ లేక ఇటుక బట్టీల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
    4
    పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఇటుక బట్టీలలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన పై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేశారు. కుక్కల బెడద నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. 
సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటుక బట్టిలో మృతి వివరాలను బాలిక తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఇటుక బట్టీల్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఇటుక బట్టీ యజమానికి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయం అందించడం జరుగుతుందని, దాడికి సంబంధించిన వివరాల నివేదికను జిల్లా జడ్జికి పంపించడం జరుగుతుందని జడ్జి గణేశ్ తెలిపారు. అలాగే చిన్నారి మృతికి కారణమైన వీధి కుక్కలపై మరియు వాటిని ప్రేరేపించే జంతు ప్రేమికులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటుక బట్టీలలో సరైన సెక్యూరిటీ లేక ఇటుక బట్టీల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆర్టీసీలో సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.
    1
    ఆర్టీసీలో సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.