logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి చేసిన ఉద్ఘాటనలో, ఇకపై రాజకీయ పదవులే తమ ఉద్యోగాలని స్పష్టం చేశారు. రాజ్యాధికార సమరభేరి యుద్ధానికి సిద్ధం కావాలని, తేల్చుకునే సమయం ఇదేనని బలమైన పిలుపునిచ్చారు. 'మనం ఎంతో మనకు అంత' అనే సూత్రాన్ని నొక్కి చెబుతూ, యుద్ధానికి సిద్ధమై బయలుదేరాలని పునరుద్ఘాటించారు.

1 hr ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago

విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి చేసిన ఉద్ఘాటనలో, ఇకపై రాజకీయ పదవులే తమ ఉద్యోగాలని స్పష్టం చేశారు. రాజ్యాధికార సమరభేరి యుద్ధానికి సిద్ధం కావాలని, తేల్చుకునే సమయం ఇదేనని బలమైన పిలుపునిచ్చారు. 'మనం ఎంతో మనకు అంత' అనే సూత్రాన్ని నొక్కి చెబుతూ, యుద్ధానికి సిద్ధమై బయలుదేరాలని పునరుద్ఘాటించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తిరుమల శ్రీవారి దివ్య సహచరిణి అయిన అలివేలు మంగమ్మ జగన్మాతను భక్తులు కరుణ, ప్రేమ, ఐశ్వర్యాలను ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఆమెను భక్తిశ్రద్ధలతో దర్శించి ప్రార్థించిన వారికి శాంతి, సౌభాగ్యం, సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అలివేలు మంగమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని భక్తులు కోరుకుంటున్నారు. అమ్మ కటాక్షం ఉంటే అసాధ్యం అనేది లేదనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. శ్రీ పద్మావతి అలివేలు మంగమ్మ తల్లి కటాక్షం సకల జనులపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.
    1
    తిరుమల శ్రీవారి దివ్య సహచరిణి అయిన అలివేలు మంగమ్మ జగన్మాతను భక్తులు కరుణ, ప్రేమ, ఐశ్వర్యాలను ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఆమెను భక్తిశ్రద్ధలతో దర్శించి ప్రార్థించిన వారికి శాంతి, సౌభాగ్యం, సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అలివేలు మంగమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని భక్తులు కోరుకుంటున్నారు. అమ్మ కటాక్షం ఉంటే అసాధ్యం అనేది లేదనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. శ్రీ పద్మావతి అలివేలు మంగమ్మ తల్లి కటాక్షం సకల జనులపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఏరియాలో మొహర్రం రోజున, సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరపున జిఎం శ్రీ వి. కృష్ణయ్య గారు మరియు ఇతర అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిఎం శ్రీ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, 1938వ సంవత్సరంలో ఇల్లందులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 37 మంది పురుషులు మరియు 6 మంది మహిళా ఉద్యోగులు సహా మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా మొహర్రం నాడు గని ప్రదేశంలో సంస్మరణ సభ నిర్వహించి నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. నాడు వారు వేసిన బాటలు నేటి భావితరానికి పునాది అయ్యాయని ఆయన అన్నారు. 1886లో డా. కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఇల్లందు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారని, ఆపై బ్రిటీషర్లు దక్కన్ కంపెనీ పేరుతో 1889లో ఇక్కడ బొగ్గు బావులను తవ్వడం ప్రారంభించారని వివరించారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా 59,671 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ 49 సంవత్సరాలు పనిచేసిన క్రమంలో, దురదృష్టవశాత్తూ 1938 మార్చి 12న ఈ పెద్ద ప్రమాదం సంభవించిందని జిఎం కృష్ణయ్య గుర్తుచేశారు. బ్రిటీషర్లు కింగ్ సీం ద్వారా చక్కటి నాణ్యమైన బొగ్గును తీస్తున్న సమయంలో, స్ట్రట్ ఇంక్లైన్‌కు దగ్గరగా 100 మీటర్ల లోతులో ఉన్న ఒక ప్యానల్‌ను 1937లో ప్రారంభించి 9 నెలలుగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో సాండ్ స్టోవింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో కేవలం కేవింగ్ మెథడ్ ద్వారా పని జరిగింది. ఐసోలేషన్ గోడలు నిర్మించడం కోసం అక్కడ ఉన్న షెల్ బొగ్గు పెల్లలతో గోడలు నిర్మించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు, పైనుండి బోర్వెల్ వేసి దాని ద్వారా మట్టి నీరు పంపించి గోడలు నిర్మించే తరుణంలో 1938 మార్చి 12వ తేదీ రాత్రి దాదాపు 11:00 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. గనుల మేనేజర్ శ్రీ ఆర్.ఎల్. యాండ్రూస్ ఆధ్వర్యంలో పని జరుగుతున్న వేళ, ఒక పెద్ద బండ కూలడంతో విషవాయువులు వెలువడ్డాయి. అక్కడ పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు వెంటనే ఆ విషవాయువులను పీల్చడం ద్వారా ప్రాణాలు కోల్పోయారని జిఎం తెలిపారు. ఈ సంఘటన కారణంగా, సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం మొహర్రం పండుగను సెలవుదినంగా ప్రకటించింది. అలాగే, ఇల్లందు ఏరియాలో శుక్రవారం వారాంతపు సెలవుదినంగా ప్రకటించినట్లు తెలియజేశారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో జే.కే.పి.ఓ. జాకీర్ హుస్సేన్, డిజియం (సివిల్) రవి కుమార్, జే.కే. మేనేజర్ పి. పుర్ణచందర్, ఇతర అధికారులు దామోదర్, రామదాస్, అంజి రెడ్డి, యాన్. సతీష్, డేవిడ్, జి. సుధాకర్, ఇల్లందు అధికారుల సంఘం అద్యశులు బి. నాగేశ్వర రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్యసంఘం ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లుతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఏరియాలో మొహర్రం రోజున, సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరపున జిఎం శ్రీ వి. కృష్ణయ్య గారు మరియు ఇతర అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జిఎం శ్రీ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, 1938వ సంవత్సరంలో ఇల్లందులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 37 మంది పురుషులు మరియు 6 మంది మహిళా ఉద్యోగులు సహా మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా మొహర్రం నాడు గని ప్రదేశంలో సంస్మరణ సభ నిర్వహించి నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. నాడు వారు వేసిన బాటలు నేటి భావితరానికి పునాది అయ్యాయని ఆయన అన్నారు. 1886లో డా. కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఇల్లందు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారని, ఆపై బ్రిటీషర్లు దక్కన్ కంపెనీ పేరుతో 1889లో ఇక్కడ బొగ్గు బావులను తవ్వడం ప్రారంభించారని వివరించారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా 59,671 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ 49 సంవత్సరాలు పనిచేసిన క్రమంలో, దురదృష్టవశాత్తూ 1938 మార్చి 12న ఈ పెద్ద ప్రమాదం సంభవించిందని జిఎం కృష్ణయ్య గుర్తుచేశారు.

బ్రిటీషర్లు కింగ్ సీం ద్వారా చక్కటి నాణ్యమైన బొగ్గును తీస్తున్న సమయంలో, స్ట్రట్ ఇంక్లైన్‌కు దగ్గరగా 100 మీటర్ల లోతులో ఉన్న ఒక ప్యానల్‌ను 1937లో ప్రారంభించి 9 నెలలుగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో సాండ్ స్టోవింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో కేవలం కేవింగ్ మెథడ్ ద్వారా పని జరిగింది. ఐసోలేషన్ గోడలు నిర్మించడం కోసం అక్కడ ఉన్న షెల్ బొగ్గు పెల్లలతో గోడలు నిర్మించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు, పైనుండి బోర్వెల్ వేసి దాని ద్వారా మట్టి నీరు పంపించి గోడలు నిర్మించే తరుణంలో 1938 మార్చి 12వ తేదీ రాత్రి దాదాపు 11:00 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. గనుల మేనేజర్ శ్రీ ఆర్.ఎల్. యాండ్రూస్ ఆధ్వర్యంలో పని జరుగుతున్న వేళ, ఒక పెద్ద బండ కూలడంతో విషవాయువులు వెలువడ్డాయి. అక్కడ పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు వెంటనే ఆ విషవాయువులను పీల్చడం ద్వారా ప్రాణాలు కోల్పోయారని జిఎం తెలిపారు.

ఈ సంఘటన కారణంగా, సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం మొహర్రం పండుగను సెలవుదినంగా ప్రకటించింది. అలాగే, ఇల్లందు ఏరియాలో శుక్రవారం వారాంతపు సెలవుదినంగా ప్రకటించినట్లు తెలియజేశారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో జే.కే.పి.ఓ. జాకీర్ హుస్సేన్, డిజియం (సివిల్) రవి కుమార్, జే.కే. మేనేజర్ పి. పుర్ణచందర్, ఇతర అధికారులు దామోదర్, రామదాస్, అంజి రెడ్డి, యాన్. సతీష్, డేవిడ్, జి. సుధాకర్, ఇల్లందు అధికారుల సంఘం అద్యశులు బి. నాగేశ్వర రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్యసంఘం ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లుతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Shiva shankar Yld
    Shiva shankar Yld
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ నెల 29 నుండి జులై 3వ తేదీ వరకు మహాకుంభాభిషేకం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి హాజరుకానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు, విద్యుత్, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
    1
    ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ నెల 29 నుండి జులై 3వ తేదీ వరకు మహాకుంభాభిషేకం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి హాజరుకానున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు, విద్యుత్, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • కల్లూరు గూడెం వద్ద పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలనకు వచ్చిన సందర్భంగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక పామాయిల్ రైతు తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. మంత్రి గారి కృషి వల్లే తాను పామాయిల్ పంట సాగు చేయగలిగానని, రైతులందరూ ఆయన ప్రయత్నాల కారణంగానే చల్లగా ఉంటున్నారని ఆ రైతు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    1
    కల్లూరు గూడెం వద్ద పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలనకు వచ్చిన సందర్భంగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక పామాయిల్ రైతు తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. మంత్రి గారి కృషి వల్లే తాను పామాయిల్ పంట సాగు చేయగలిగానని, రైతులందరూ ఆయన ప్రయత్నాల కారణంగానే చల్లగా ఉంటున్నారని ఆ రైతు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంలో గోదావరి వరదల నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు ప్రణాళికలు, తీసుకోవలసిన చర్యలపై జిల్లాస్థాయి ఉన్నత అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, గోదావరి వరదల ముందస్తు ప్రణాళికకు సంబంధించి అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాసనసభ్యులు, ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంలో గోదావరి వరదల నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు ప్రణాళికలు, తీసుకోవలసిన చర్యలపై జిల్లాస్థాయి ఉన్నత అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, గోదావరి వరదల ముందస్తు ప్రణాళికకు సంబంధించి అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాసనసభ్యులు, ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    34 min ago
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటు సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేసిన 21 ఆవులు ఈ పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో పశువుల యజమాని సమ్మయ్యకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ విషాదకర ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతుకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటు సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేసిన 21 ఆవులు ఈ పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో పశువుల యజమాని సమ్మయ్యకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

ఈ విషాదకర ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతుకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి చేసిన ఉద్ఘాటనలో, ఇకపై రాజకీయ పదవులే తమ ఉద్యోగాలని స్పష్టం చేశారు. రాజ్యాధికార సమరభేరి యుద్ధానికి సిద్ధం కావాలని, తేల్చుకునే సమయం ఇదేనని బలమైన పిలుపునిచ్చారు. 'మనం ఎంతో మనకు అంత' అనే సూత్రాన్ని నొక్కి చెబుతూ, యుద్ధానికి సిద్ధమై బయలుదేరాలని పునరుద్ఘాటించారు.
    1
    విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి చేసిన ఉద్ఘాటనలో, ఇకపై రాజకీయ పదవులే తమ ఉద్యోగాలని స్పష్టం చేశారు. రాజ్యాధికార సమరభేరి యుద్ధానికి సిద్ధం కావాలని, తేల్చుకునే సమయం ఇదేనని బలమైన పిలుపునిచ్చారు. 'మనం ఎంతో మనకు అంత' అనే సూత్రాన్ని నొక్కి చెబుతూ, యుద్ధానికి సిద్ధమై బయలుదేరాలని పునరుద్ఘాటించారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ఉన్న పాలేరు జలాశయం నీటిమట్టం క్రమక్రమంగా తగ్గి 12 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సాగర్ జలాలు పాలేరు జలాశయానికి చేరుకున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నీటి విడుదల మూడు రోజుల పాటు కొనసాగనుంది. అనంతరం నీటి విడుదలను నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
    1
    ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ఉన్న పాలేరు జలాశయం నీటిమట్టం క్రమక్రమంగా తగ్గి 12 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సాగర్ జలాలు పాలేరు జలాశయానికి చేరుకున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నీటి విడుదల మూడు రోజుల పాటు కొనసాగనుంది. అనంతరం నీటి విడుదలను నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.