Shuru
Apke Nagar Ki App…
ప్రజల జీవితాలతో చాలగాటలాడటం సరైన పద్ధతి కాదు:మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం పట్టణంలోని కంపోస్టు డంపింగ్ యార్డు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆయన యార్డును పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం తగదని ఆయన పేర్కొన్నారు.
PHANI JOURNALIST
ప్రజల జీవితాలతో చాలగాటలాడటం సరైన పద్ధతి కాదు:మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం పట్టణంలోని కంపోస్టు డంపింగ్ యార్డు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆయన యార్డును పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం తగదని ఆయన పేర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్వామివారు సింహ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు.యాదవ,కురుబ, బుడబుక్కుల, వెలమ సంఘముల ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం నుండి లక్ష్మీ బజార్ వరకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ యువ నరసింహారెడ్డి, అర్చకులు బాలమురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.1
- మేడే స్ఫూర్తి నుంచి తిరుగుబాటు దిశగా... కార్మిక హక్కులపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వాలు,అనంతలో సిఐటియు గర్జన అనంతపురం, “మేడే” అంటే కేవలం కార్మికుల పండుగ కాదు… హక్కుల కోసం రక్తం చిందించిన పోరాటాల జ్ఞాపకం. అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమాలు కార్మిక వర్గ అసంతృప్తికి ప్రతిబింబంగా మారాయి. ఎర్రజెండాలతో ఊరూరా మార్మోగిన నినాదాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహావేశాలు, ప్రభుత్వాలపై విమర్శలతో మేడే సభలు ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లాలోని 31 మండలాల్లో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, సుమారు 5 వేల మందికి పైగా కార్మికులు పాల్గొని ఐక్యతను చాటారు. అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లేబర్ కోడ్స్ రద్దు చేయాలి”, “కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి”, “కనీస వేతనాలు అమలు చేయాలి” అంటూ కార్మికులు నినాదాలతో నగరాన్ని కదిలించారు. “44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్లో కుదించి హక్కుల నిర్వీర్యం” సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరిట బలహీనపరచడం కార్మికుల హక్కులపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. ఈ కోడ్స్ కార్మికుల రక్షణ కోసం కాకుండా పెట్టుబడిదారుల లాభాల కోసం రూపొందించబడినవని విమర్శించారు.4
- ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు1
- గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు1
- కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..1
- చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని రాయదుర్గం అర్బన్ సిఐ జయ నాయక్ సూచించారు. రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ బజార్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుట్కా, డ్రగ్స్, మత్తు పదార్థాలు,ఆల్కహాల్ కి దూరంగా ఉంటూ మంచి జీవితాలను నిర్మించుకోవాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. పిల్లల పట్ల వారి వారి తల్లిదండ్రులను ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు.1