Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు: పట్టణం లోని మైదుకూరు రోడ్డులోని మునిసిపల్ పెట్రోల్ బంక్ నందు రద్దీ ఎక్కువ అయినదని తెలిసి మునిసిపల్ కనీషనర్ వి వి నరసింహారెడ్డి , మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందర్శించి రద్దీని క్లియర్ చేశారు.రద్దీ సమయాల్లో కూడా ఇంధన స్టాక్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్న సిబ్బందిని కమీషనర్ నరసింహారెడ్డి అభినందించారు. డైలీ మామూలు రోజుల్లో ఐదున్నర లక్షల వ్యాపారకార్యకలాపాలు జరిగేవని ఈరోజు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు .1
- పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తే… పార్టీ ఎలా ఎదగనిస్తుందో చెప్పడానికి చంద్రబాబు గారు, నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయమే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకంలో సమర్థవంతంగా పని చేసే మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పెద్దపీట వేశారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్చార్జ్ గుత్తికొండ ధనుంజయ్లను నేరుగా పొలిట్బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైంది.1
- చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణనికి సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు తక్షణమే రద్దు చేయాలి సర్వే కు వచ్చిన అధికారులపై ఎస్,సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పై సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ అధికార బృందం సర్వే పై గిరిజన సంక్షేమ మంత్రి జిల్ల కలెక్టర్ వైఖరి చెప్పాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలు, నిర్మాణ పనులు ఆపివేసినట్లు గతంలో హామీనిచ్చిన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి,గత కలెక్టర్ హామీ మరోవైపు కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా సర్వే చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం తీసింది తక్షణమే సర్వేలు నిలుపు దలచెయ్యాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జీవలస పరిసర గ్గ్రామాల్లో రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులైన ఆనంద్ సాహు, వర్ధబోయన గోపాలరావు బృందాన్ని 17,4,2026 తేదీన మజ్జి వలస గ్రామంలో అడ్డుకుని స్థానిక తహశీల్ధర్, పోలీసులకు గ్రామస్తులు అప్పగించారని స్థానిక జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులకు తెలియకుండా కేంద్ర సర్వే బృందం ఎలా సర్వే చేశారని ప్రశ్నించారు రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే బృందంపై ఎస్,సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు గతంలో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు గత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు గిరిజనులు ఆమోదం లేకుండా పనులు, సర్వే లు నిలుపుదల చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారిన దొంగచాటున సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వేలు చేయించి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధం చేస్తున్నారని నవయుగ, అదానీ బడా కంపెనీలకు ఆదివాసీ అడవులు,భూములు, కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆదివాసులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ హమీ ఏమైందని ఆదివాసులకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఆదివాసీ గ్రామాల్లో వస్తే తరిమి కొడతామని ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మజ్జివలస కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 2,13,51 జారీ చేసిందని అక్రమ జీఓలు రద్దు చేయాలని ఆదివాసులు భారీ స్థాయిలో ఆందోళనలు పోరాటాలు చేశారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అక్రమ జీఓలు రద్దు చెయ్యలేదని చిట్టంవలస పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిత్రుడు నవయుగ బడా కంపెనీకి కట్టబెట్టేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే డిపార్టుమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో మజ్జీవలస పరిసర ప్రాంతాల్లో సర్వే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సర్వేలు చేసిన ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మజ్జీవలస పరిసర గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నా నేపద్యంలో గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూర్జ ఎంపీటీసీ మజ్జి హరి, పెసా ఉపాధ్యక్షులు పరశురాం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ కృష్ణారావు,ఎస్ కొండలరావు గెమ్మెలి చినబాబు, వి.లక్ష్మణరావు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మజ్జి కృష్ణంరాజు, మజ్జి పరశురాం,మజ్జి బాలరాజు, ప్రసాద్, కళ్యాణిశ్రీ, కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు1
- ఎమ్మిగనూరు సబ్డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.1
- కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నేరుగా ప్రయాణికులతో మాట్లాడి, ఆర్టీసీ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఈపీటీఓ రాము, డీఎం దినేశ్ తదితరులు పాల్గొన్నారు.1
- MATTUPALLI APPLIANCES nanu1
- Post by Bondhu Suresh1
- బద్వేలు: బద్వేలు లో నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో అల్లాడుతున్న వాహనదారులు ఇక్కట్లకు గురి అవుతున్నారు. ముందుగా కొంతమంది బొంకుల వాళ్ళు తెచ్చుకున్న పెట్రోల్ ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పట్లో ఈ సమస్య వీరేనా..? మరి వేచి చూడాలి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.1