logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఈనెల 30న జరగనున్న రైతు ఆశీర్వాద సభకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. సభకు ఎటువంటి ఆటంకం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సభ నిర్వహణ కోసం 30 ఎకరాలు, పార్కింగ్ కోసం 150 ఎకరాలు కేటాయించబడ్డాయి. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలను సమీకరించేలా ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.

4 hrs ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
4 hrs ago

చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఈనెల 30న జరగనున్న రైతు ఆశీర్వాద సభకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. సభకు ఎటువంటి ఆటంకం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సభ నిర్వహణ కోసం 30 ఎకరాలు, పార్కింగ్ కోసం 150 ఎకరాలు కేటాయించబడ్డాయి. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలను సమీకరించేలా ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.

More news from తెలంగాణ and nearby areas
  • ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ నెల 29 నుండి జులై 3వ తేదీ వరకు మహాకుంభాభిషేకం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి హాజరుకానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు, విద్యుత్, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
    1
    ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ నెల 29 నుండి జులై 3వ తేదీ వరకు మహాకుంభాభిషేకం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి హాజరుకానున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు, విద్యుత్, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో జరగనున్న 'సమరభేరి' మహాసభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. ఈ సభకు వివిధ ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు అణగారిన వర్గాలకు రాజకీయ అధికారంలో తగిన వాటా కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ 'సమరభేరి' సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మహాసభకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ 'సమరభేరి' సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త దిశను చూపించే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం మరియు సమాన రాజకీయ అవకాశాల కోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. జై తెలంగాణ – జై బీసీ రాజ్యాధికారం అంటూ నినాదాలు చేశారు.
    1
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో జరగనున్న 'సమరభేరి' మహాసభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. ఈ సభకు వివిధ ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు అణగారిన వర్గాలకు రాజకీయ అధికారంలో తగిన వాటా కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ 'సమరభేరి' సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మహాసభకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ 'సమరభేరి' సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త దిశను చూపించే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం మరియు సమాన రాజకీయ అవకాశాల కోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. జై తెలంగాణ – జై బీసీ రాజ్యాధికారం అంటూ నినాదాలు చేశారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • కల్లూరు గూడెం వద్ద పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలనకు వచ్చిన సందర్భంగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక పామాయిల్ రైతు తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. మంత్రి గారి కృషి వల్లే తాను పామాయిల్ పంట సాగు చేయగలిగానని, రైతులందరూ ఆయన ప్రయత్నాల కారణంగానే చల్లగా ఉంటున్నారని ఆ రైతు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    1
    కల్లూరు గూడెం వద్ద పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలనకు వచ్చిన సందర్భంగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక పామాయిల్ రైతు తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. మంత్రి గారి కృషి వల్లే తాను పామాయిల్ పంట సాగు చేయగలిగానని, రైతులందరూ ఆయన ప్రయత్నాల కారణంగానే చల్లగా ఉంటున్నారని ఆ రైతు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • పెదకూరపాడులో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తహసిల్దార్ కుంభ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పోలియో చుక్కలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ మండల పరిధిలో 5 సంవత్సరాలలోపు 3932 మంది చిన్నారులు ఉన్నారని, వారందరికీ తప్పకుండా రెండు చుక్కల పోలియో మందు వేయించాలని తహసిల్దార్ కోరారు. ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. పోలియో చుక్కలు వేయించి చిన్నారులను సురక్షితంగా ఉంచాలని తహసిల్దార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    పెదకూరపాడులో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తహసిల్దార్ కుంభ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పోలియో చుక్కలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ మండల పరిధిలో 5 సంవత్సరాలలోపు 3932 మంది చిన్నారులు ఉన్నారని, వారందరికీ తప్పకుండా రెండు చుక్కల పోలియో మందు వేయించాలని తహసిల్దార్ కోరారు.

ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. పోలియో చుక్కలు వేయించి చిన్నారులను సురక్షితంగా ఉంచాలని తహసిల్దార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఏరియాలో మొహర్రం రోజున, సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరపున జిఎం శ్రీ వి. కృష్ణయ్య గారు మరియు ఇతర అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిఎం శ్రీ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, 1938వ సంవత్సరంలో ఇల్లందులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 37 మంది పురుషులు మరియు 6 మంది మహిళా ఉద్యోగులు సహా మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా మొహర్రం నాడు గని ప్రదేశంలో సంస్మరణ సభ నిర్వహించి నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. నాడు వారు వేసిన బాటలు నేటి భావితరానికి పునాది అయ్యాయని ఆయన అన్నారు. 1886లో డా. కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఇల్లందు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారని, ఆపై బ్రిటీషర్లు దక్కన్ కంపెనీ పేరుతో 1889లో ఇక్కడ బొగ్గు బావులను తవ్వడం ప్రారంభించారని వివరించారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా 59,671 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ 49 సంవత్సరాలు పనిచేసిన క్రమంలో, దురదృష్టవశాత్తూ 1938 మార్చి 12న ఈ పెద్ద ప్రమాదం సంభవించిందని జిఎం కృష్ణయ్య గుర్తుచేశారు. బ్రిటీషర్లు కింగ్ సీం ద్వారా చక్కటి నాణ్యమైన బొగ్గును తీస్తున్న సమయంలో, స్ట్రట్ ఇంక్లైన్‌కు దగ్గరగా 100 మీటర్ల లోతులో ఉన్న ఒక ప్యానల్‌ను 1937లో ప్రారంభించి 9 నెలలుగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో సాండ్ స్టోవింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో కేవలం కేవింగ్ మెథడ్ ద్వారా పని జరిగింది. ఐసోలేషన్ గోడలు నిర్మించడం కోసం అక్కడ ఉన్న షెల్ బొగ్గు పెల్లలతో గోడలు నిర్మించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు, పైనుండి బోర్వెల్ వేసి దాని ద్వారా మట్టి నీరు పంపించి గోడలు నిర్మించే తరుణంలో 1938 మార్చి 12వ తేదీ రాత్రి దాదాపు 11:00 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. గనుల మేనేజర్ శ్రీ ఆర్.ఎల్. యాండ్రూస్ ఆధ్వర్యంలో పని జరుగుతున్న వేళ, ఒక పెద్ద బండ కూలడంతో విషవాయువులు వెలువడ్డాయి. అక్కడ పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు వెంటనే ఆ విషవాయువులను పీల్చడం ద్వారా ప్రాణాలు కోల్పోయారని జిఎం తెలిపారు. ఈ సంఘటన కారణంగా, సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం మొహర్రం పండుగను సెలవుదినంగా ప్రకటించింది. అలాగే, ఇల్లందు ఏరియాలో శుక్రవారం వారాంతపు సెలవుదినంగా ప్రకటించినట్లు తెలియజేశారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో జే.కే.పి.ఓ. జాకీర్ హుస్సేన్, డిజియం (సివిల్) రవి కుమార్, జే.కే. మేనేజర్ పి. పుర్ణచందర్, ఇతర అధికారులు దామోదర్, రామదాస్, అంజి రెడ్డి, యాన్. సతీష్, డేవిడ్, జి. సుధాకర్, ఇల్లందు అధికారుల సంఘం అద్యశులు బి. నాగేశ్వర రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్యసంఘం ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లుతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఏరియాలో మొహర్రం రోజున, సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా స్ట్రట్ ఇంక్లైన్ గని ప్రమాదంలో మరణించిన అధికారులు, ఉద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరపున జిఎం శ్రీ వి. కృష్ణయ్య గారు మరియు ఇతర అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జిఎం శ్రీ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, 1938వ సంవత్సరంలో ఇల్లందులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 37 మంది పురుషులు మరియు 6 మంది మహిళా ఉద్యోగులు సహా మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా మొహర్రం నాడు గని ప్రదేశంలో సంస్మరణ సభ నిర్వహించి నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. నాడు వారు వేసిన బాటలు నేటి భావితరానికి పునాది అయ్యాయని ఆయన అన్నారు. 1886లో డా. కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఇల్లందు పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారని, ఆపై బ్రిటీషర్లు దక్కన్ కంపెనీ పేరుతో 1889లో ఇక్కడ బొగ్గు బావులను తవ్వడం ప్రారంభించారని వివరించారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా 59,671 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ 49 సంవత్సరాలు పనిచేసిన క్రమంలో, దురదృష్టవశాత్తూ 1938 మార్చి 12న ఈ పెద్ద ప్రమాదం సంభవించిందని జిఎం కృష్ణయ్య గుర్తుచేశారు.

బ్రిటీషర్లు కింగ్ సీం ద్వారా చక్కటి నాణ్యమైన బొగ్గును తీస్తున్న సమయంలో, స్ట్రట్ ఇంక్లైన్‌కు దగ్గరగా 100 మీటర్ల లోతులో ఉన్న ఒక ప్యానల్‌ను 1937లో ప్రారంభించి 9 నెలలుగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో సాండ్ స్టోవింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో కేవలం కేవింగ్ మెథడ్ ద్వారా పని జరిగింది. ఐసోలేషన్ గోడలు నిర్మించడం కోసం అక్కడ ఉన్న షెల్ బొగ్గు పెల్లలతో గోడలు నిర్మించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు, పైనుండి బోర్వెల్ వేసి దాని ద్వారా మట్టి నీరు పంపించి గోడలు నిర్మించే తరుణంలో 1938 మార్చి 12వ తేదీ రాత్రి దాదాపు 11:00 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. గనుల మేనేజర్ శ్రీ ఆర్.ఎల్. యాండ్రూస్ ఆధ్వర్యంలో పని జరుగుతున్న వేళ, ఒక పెద్ద బండ కూలడంతో విషవాయువులు వెలువడ్డాయి. అక్కడ పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు వెంటనే ఆ విషవాయువులను పీల్చడం ద్వారా ప్రాణాలు కోల్పోయారని జిఎం తెలిపారు.

ఈ సంఘటన కారణంగా, సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం మొహర్రం పండుగను సెలవుదినంగా ప్రకటించింది. అలాగే, ఇల్లందు ఏరియాలో శుక్రవారం వారాంతపు సెలవుదినంగా ప్రకటించినట్లు తెలియజేశారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో జే.కే.పి.ఓ. జాకీర్ హుస్సేన్, డిజియం (సివిల్) రవి కుమార్, జే.కే. మేనేజర్ పి. పుర్ణచందర్, ఇతర అధికారులు దామోదర్, రామదాస్, అంజి రెడ్డి, యాన్. సతీష్, డేవిడ్, జి. సుధాకర్, ఇల్లందు అధికారుల సంఘం అద్యశులు బి. నాగేశ్వర రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్యసంఘం ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లుతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Shiva shankar Yld
    Shiva shankar Yld
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్లో ప్రభుత్వ వాహనాలతో అనర్హులకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడైంది. పారిశుద్ధ్య కార్మికుల అత్యుత్సాహం కారణంగా ఎటువంటి అర్హతలు లేని వ్యక్తులకు మున్సిపాలిటీ ట్రాక్టర్లు నడపడం నేర్పుతున్నారని, ఈ క్రమంలో ట్రాక్టర్ నేర్చుకుంటున్న ఒక యువకుడు పక్కన ఉన్న ఒక షాపుకి కట్టిన తడికను ఢీకొట్టాడని సమాచారం. ఇది కేవలం ఒక్క సంఘటన కాదని, ఇలా ఎంతో మందికి మున్సిపాలిటీ ట్రాక్టర్ల మీద డ్రైవింగ్ నేర్పించి, అర్హతలు లేని వారిని మున్సిపాలిటీలో ట్రాక్టర్లు నడపడానికి విధుల్లో నియమించిన ఘనకార్యాలు కూడా గతంలో జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన శిక్షణ, నియమాకాలు ఒక సామాజిక వర్గానికి మాత్రమే సాధ్యమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, దీని వల్ల ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్లో ప్రభుత్వ వాహనాలతో అనర్హులకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడైంది. పారిశుద్ధ్య కార్మికుల అత్యుత్సాహం కారణంగా ఎటువంటి అర్హతలు లేని వ్యక్తులకు మున్సిపాలిటీ ట్రాక్టర్లు నడపడం నేర్పుతున్నారని, ఈ క్రమంలో ట్రాక్టర్ నేర్చుకుంటున్న ఒక యువకుడు పక్కన ఉన్న ఒక షాపుకి కట్టిన తడికను ఢీకొట్టాడని సమాచారం.

ఇది కేవలం ఒక్క సంఘటన కాదని, ఇలా ఎంతో మందికి మున్సిపాలిటీ ట్రాక్టర్ల మీద డ్రైవింగ్ నేర్పించి, అర్హతలు లేని వారిని మున్సిపాలిటీలో ట్రాక్టర్లు నడపడానికి విధుల్లో నియమించిన ఘనకార్యాలు కూడా గతంలో జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన శిక్షణ, నియమాకాలు ఒక సామాజిక వర్గానికి మాత్రమే సాధ్యమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, దీని వల్ల ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఈ నెల 28, 29, 30 తేదీల్లో చింతకాని మండలం జగన్నాథపురం – మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద జరగనున్న రైతు మేళా మరియు సీఎం రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన వేదిక, స్టాళ్లు, పార్కింగ్ స్థలాలు, భోజనశాలలు, తాగునీరు మరియు పారిశుద్ధ్య ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేయడంతో పాటు ఆదేశాలు ఇచ్చారు.
    1
    ఈ నెల 28, 29, 30 తేదీల్లో చింతకాని మండలం జగన్నాథపురం – మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద జరగనున్న రైతు మేళా మరియు సీఎం రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన వేదిక, స్టాళ్లు, పార్కింగ్ స్థలాలు, భోజనశాలలు, తాగునీరు మరియు పారిశుద్ధ్య ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేయడంతో పాటు ఆదేశాలు ఇచ్చారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.