Shuru
Apke Nagar Ki App…
ఎడతెరిపి వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సూరారం, బాగిరెడ్డిపల్లి, చెన్నైపల్లి తదితర గ్రామాల పరిసరాల్లో వాగులు, కుంటలు నిండుకుండలా మారి పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా వాగులు, కాల్వలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.
Priya
ఎడతెరిపి వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సూరారం, బాగిరెడ్డిపల్లి, చెన్నైపల్లి తదితర గ్రామాల పరిసరాల్లో వాగులు, కుంటలు నిండుకుండలా మారి పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా వాగులు, కాల్వలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- అనాథ బాలుడి చదువుకు గురువు అండ.. భవిష్యత్ కోసం ప్రత్యేక నిధికి శ్రీకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి నానమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఎన్నో ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ్ కుమార్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అతని భవిష్యత్ విద్య కోసం ప్రత్యేక ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ నిధికి తొలి విరాళంగా రూ.5,116 అందజేస్తానని ప్రకటించి, దాతలు ముందుకు వచ్చి బాలుడి విద్యాభారాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.1
- సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.1
- మెదక్లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంNSSHసురేష్ మెదక్లో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ అవగాహన, ప్రత్యేక వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమం మెదక్లో గురువారం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (NSSH), హైదరాబాద్ ఆధ్వర్యంలో, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) సహకారంతో ఎంట్రప్రెన్యూర్ అవగాహన మరియు ప్రత్యేక వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక కన్వెన్షన్ హాల్, మెదక్లో జరిగింది.అతిథుల స్వాగతం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ NSSHO ఎస్. సురేష్ స్వాగత ప్రసంగం చేశారు.తదుపరి డిక్కీ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు జె. సీతారాం, డిక్కీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి, ఎన్ఎస్ఐసీ (AP & తెలంగాణ) జోనల్ జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న సహాయ కార్యక్రమాలపై వివరించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ–ఎస్టీ యువత ముందుకు రావాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సాంకేతిక సమావేశంలో ప్రభుత్వ కొనుగోలు విధానాలు, వెండర్ రిజిస్ట్రేషన్, ఆర్థిక సహాయం, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ , దళిత సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.1
- కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడ్డాయని, సిబ్బంది నియామకాలు పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులు కూడా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.1
- భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.1
- బార్డర్ చెకింగ్ పేరిట తెలంగాణలో లారీల వద్ద వసూళ్ల దందా కామారెడ్డి పోలీస్ పేరిట నేమ్ బ్యాడ్జ్ లేకుండా లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులు ఓ లారీ డ్రైవర్ వీడియో తీస్తూ నిలదీయడంతో పొంతన లేని సమాధానం1