ఖమ్మం జిల్లాలో 108 సర్వీస్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT )గా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ నేషనల్ EMT DAY శుభాకాంక్షలు. 2005 ఆగస్టు 15వ తారీకు ప్రారంభం నుంచి ఇప్పటివరకు రోగులకు క్షతగాత్రులకు కరోనా రోగులకు ఎన్నో సేవలు అందించిన ఘనత ఖమ్మం జిల్లా ఉద్యోగులకు ఉంది. కోవిడ్ కరోనా సమయంలో దశలవారీగా ప్రతి ఉద్యోగి హైదరాబాద్ వెళ్లి కరోనా డ్యూటీ చేసి రావడం జరిగింది. మండల పరిధిలో 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించడం జరిగింది. గడచిన సంవత్సర కాలంలో 26707 మందికి సేవలు అందించడం జరిగింది. అందులో రోడ్డు ప్రమాదాలు =4146 కేసులు గర్భిణీ స్త్రీలు =3227 మెడికల్ కేసులు=8695 గుండె సంబంధిత కేసులు=1828 పాయిజన్ కేసులు =1353 పాము కాటు మరియు తేలుకాటు =725 సమాచారం అందుకున్న వెంటనే క్షణాల్లో సకాలంలో క్షతగాత్రుల వద్దకు రోగుల వద్దకు చేరుకోవడం ప్రధమ చికిత్స, ఫ్రీ హాస్పిటల్ కేర్ అందించడం. బాధ్యతాయుతంగా హాస్పిటల్లో చేర్పించడం, ఆ వివరాలు అన్నీ రికార్డుల్లో నమోదు చేయడం అంబులెన్స్ లో మందుల నిర్వహణ శుభ్రత వాహన చోదకుడితో సమయస్ఫూర్తితో వ్యవహరించడం. పనికి తగిన ప్రతిఫలం అవార్డులు అధికారుల మన్ననలు పొందడం ఖమ్మం జిల్లా ఉద్యోగులకు సాధ్యమైంది. అనేకమంది గర్భవతులు అంబులెన్స్ లోనే ప్రసవించడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా 108 మేనేజర్ అవులూరి. దుర్గాప్రసాద్ గారు, ప్రోగ్రాం మేనేజర్ షేక్. నజీరుద్దీన్ గారి ప్రోత్సాహం తో గోల్డెన్ అవర్ పాటిస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతూ క్షతగాత్రులను సకాలంలో ఆదుకుంటూ ముందుకు వెళుతున్న 108 EMT లకు నేషనల్ EMT Day శుభాకాంక్షలు
ఖమ్మం జిల్లాలో 108 సర్వీస్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT )గా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ నేషనల్ EMT DAY శుభాకాంక్షలు. 2005 ఆగస్టు 15వ తారీకు ప్రారంభం నుంచి ఇప్పటివరకు రోగులకు క్షతగాత్రులకు కరోనా రోగులకు ఎన్నో సేవలు అందించిన ఘనత ఖమ్మం జిల్లా ఉద్యోగులకు ఉంది. కోవిడ్ కరోనా సమయంలో దశలవారీగా ప్రతి ఉద్యోగి హైదరాబాద్ వెళ్లి కరోనా డ్యూటీ చేసి రావడం జరిగింది. మండల పరిధిలో 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించడం జరిగింది. గడచిన సంవత్సర కాలంలో 26707 మందికి సేవలు అందించడం జరిగింది. అందులో రోడ్డు ప్రమాదాలు =4146 కేసులు గర్భిణీ స్త్రీలు =3227 మెడికల్ కేసులు=8695 గుండె సంబంధిత కేసులు=1828 పాయిజన్ కేసులు =1353 పాము కాటు మరియు తేలుకాటు =725 సమాచారం అందుకున్న వెంటనే క్షణాల్లో సకాలంలో క్షతగాత్రుల వద్దకు రోగుల వద్దకు చేరుకోవడం ప్రధమ చికిత్స, ఫ్రీ హాస్పిటల్ కేర్ అందించడం. బాధ్యతాయుతంగా హాస్పిటల్లో చేర్పించడం, ఆ వివరాలు అన్నీ రికార్డుల్లో నమోదు చేయడం అంబులెన్స్ లో మందుల నిర్వహణ శుభ్రత వాహన చోదకుడితో సమయస్ఫూర్తితో వ్యవహరించడం. పనికి తగిన ప్రతిఫలం అవార్డులు అధికారుల మన్ననలు పొందడం ఖమ్మం జిల్లా ఉద్యోగులకు సాధ్యమైంది. అనేకమంది గర్భవతులు అంబులెన్స్ లోనే ప్రసవించడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా 108 మేనేజర్ అవులూరి. దుర్గాప్రసాద్ గారు, ప్రోగ్రాం మేనేజర్ షేక్. నజీరుద్దీన్ గారి ప్రోత్సాహం తో గోల్డెన్ అవర్ పాటిస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతూ క్షతగాత్రులను సకాలంలో ఆదుకుంటూ ముందుకు వెళుతున్న 108 EMT లకు నేషనల్ EMT Day శుభాకాంక్షలు
- Post by Ramprasad islavath1
- కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.1
- Post by Sode Prasad1
- గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.1
- अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया। लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा। संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है। FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा। लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।1
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- Post by Ramprasad islavath1