అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు గజ్వేల్*ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: గజ్వేల్ పోలీసులు* గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణానికి సంబంధించిన కౌన్సిలర్లు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు అంబేద్కర్ వేడుకల సంఘ సభ్యులు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ ఎం. మురళి, గజ్వేల్ టౌన్ సిఐ ఏ. రవికుమార్ హాజరై పట్టణ ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.వాహనదారులు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని గజ్వేల్ ట్రాఫిక్ సిఐ ఎం. మురళి సూచించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రాణాపాయాల గురించి వివరిస్తూ, అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకోవద్దని గజ్వేల్ టౌన్ సిఐ ఏ. రవికుమార్ కోరారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు గజ్వేల్*ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: గజ్వేల్ పోలీసులు* గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణానికి సంబంధించిన కౌన్సిలర్లు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు అంబేద్కర్ వేడుకల సంఘ సభ్యులు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ ఎం. మురళి, గజ్వేల్ టౌన్ సిఐ ఏ. రవికుమార్ హాజరై పట్టణ ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.వాహనదారులు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని గజ్వేల్ ట్రాఫిక్ సిఐ ఎం. మురళి సూచించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రాణాపాయాల గురించి వివరిస్తూ, అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకోవద్దని గజ్వేల్ టౌన్ సిఐ ఏ. రవికుమార్ కోరారు.
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.1
- గోపాల్ పేట మండలం తాడిపర్తి నుంచి చెన్నూరు కు వెళ్లే మార్గంలోని లక్ష్మీ సముద్రం అలుగు వద్ద వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో అలుగు పారినప్పుడు రాకపోకలు నిలిచిపోయి, వాహనదారులు ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రహదారి గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.1
- దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.4
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1