Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర జగిత్యాల : జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.
Sk chaitanya
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర జగిత్యాల : జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర జగిత్యాల : జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.1
- మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి1
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.1
- మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.1
- పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు సన్నాహాలు. ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారికి వినతి. పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిడాల భూపతికి అప్పగించారు. మంగళవారం పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఎన్నికల అధికారికి అప్పగించారు. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతిని కోరారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ త్వరలోనే యువజన సంఘానికి సంబంధించిన తుది సభ్యుల జాబితాతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.3
- కరీంనగర్లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.2
- 27వ డివిజన్లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. - కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. చట్టాలు – ఉల్లంఘనలు: నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం. మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యం: ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. AIFB ప్రధాన డిమాండ్లు: 1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి. 2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి. 4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.2
- షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల : అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు. హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.3