Shuru
Apke Nagar Ki App…
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు... జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం శనివారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ఆరగించారు. రంజాన్ ముస్లింలకు పవిత్రమైన పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
P.G. Murthy
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు... జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం శనివారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ఆరగించారు. రంజాన్ ముస్లింలకు పవిత్రమైన పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- *డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే అయ్యాను* అంబెడ్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు.ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ గారు సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు.భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కోలాం PVTG ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూర్ ITDA కార్యాలయం ఎదుట ఆదివాసీలతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సాత్నాల ఆదిలాబాద్ బేల మండలాల 9 గ్రామాల (సదల్ పూర్, దుబ్బగూడ, జున్నపని,జంగు గూడా, చిన్నూగూడ, సుందరగిరి, మామిడి కోరి, దత్తగూడ ఆదివాసీలు కోలాం ఆదివాసులు అత్యంత వెనుకబడి ఉన్నారు. మీరు అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలపై అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న లాభం లేకుండా ఉన్నది కనీస మౌలిక సమస్యలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎన్ని నిధులైన కానీ సమస్యల వీరికి లేకుండా చూస్తామని పాలకులు చెబుతున్నారు మేము ఆదివాసీ గిరిజన సంఘంగా చేసిన గ్రామాల సర్వేలో అనేక సమస్యలు గుర్తించాము ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం 1)పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి అలాగే గతంలో పుణ్యభూమి కంటే తక్కువ భూమికి పట్టాలిచ్చారు వాటిని సరిచేసి ఇవ్వాలి విరాసత్ పట్టాల సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 2) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి 3) కోలాం ఆదివాసీ లకు అంతో దయ రేషన్ కార్డులు ఇవ్వాలి ఆదివాసీలందరికీ అంతోదయ కార్డులు ఇవ్వాలి 4) ఆదివాసి గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తక్షణమే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి వేల మండలం సదల్పూర్ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 5) జంగుగూడ గ్రామం వరద ముంపు నుండి కోలామాదివాసులకు కాపాడేందుకు ఒకవైపు గోడ బ్రిడ్జి కట్టాలి 6) సోలార్ మోటార్స్ బోర్వెల్స్ ద్వారా ఆదివాసీల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలి 7) ఆదివాసి యువకులకు ఉపాధి కల్పించి వలసలను ఆపాలి ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం ఐటీడీఏ నుంచి ఆర్థిక రుణాలు ఇవ్వడం స్కిల్స్ పెంచే శిక్షణ ఇవ్వడం కోలాం వారికి తడకలు గుల్లలు బొంగు సరఫరా మార్కెట్ సౌకర్యం కల్పించాలి 8) వతందారుల(భూస్వాముల )భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పట్టాలి ఇవ్వాలి 9) వ్యవసాయ రుణాలను బ్యాంకులకు నుండి ఇప్పించాలి 10) దళారుల వడ్డీ వ్యాపారం నుండి ఆదివాసులను కాపాడాలి 11) పింఛన్లు రేషన్ కార్డులు అందించాలి 12) కరెంటు సీసీ రోడ్లు నాలి సౌకర్యం కల్పించాలి 13) వ్యవసాయ భూములను చదును చేయించాలి 14) ఆదివాసులకు ఎడ్లబండ్ల సౌకర్యం కల్పించాలి 15) మెరుగైన విద్య వైద్యం అందించాలి రక్తహీనత నుండి రక్షించాలి 16) ఉపాధి కూలీలైన ఆదివాసీ మహిళలకు 2500 రుపాయలు కూలీలకు 12000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలి 17) ఫారెస్ట్ అధికారుల వేధింపులను అభివృద్ధి పనులను అడ్డుకునేదాన్ని ఆపాలి అనంతరం AO రఘు గారికి వినతి పత్రం అందించారు. సమస్యలు అన్ని ఉన్నత అధికారులకు తక్షణమే నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు లంకా రాఘవులు జిల్లా నాయకులు కొట్నాక్ సక్కు, స్వామి, రామన్న,ఆత్రం రాము, టెకం లక్ష్మణ్, మడవి భీంరావు, పెందూర్ గోవింద్, ఆత్రం అయ్యు బాయి తదితరులు పాల్గొన్నారు TAGS జిల్లా కమిటీ3
- *పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్* నిజామాబాద్, ఏప్రిల్ 13 : ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ సత్యనారాయణ ఉన్నారు. --------------------------1
- భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..1
- మంథని లో మంత్రి శ్రీధర్ బాబు కు వింత నిరసన ఎదురయింది. గోవు ద్వారా గోశాల నిర్వాహకుడు వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబును ఆ కాలనీలో ఉన్న గౌతమేశ్వర గోశాల నిర్వహకులు ఆకుల విద్యాసాగర్ వినూత్నంగా వినతి పత్రం సమర్పించారు. గోశాల లోని పార్వతి అనే గోవు ద్వారా గోశాల దీనస్థితిని వినతి పత్రం ద్వారా మంత్రికి విన్నవించారు. మంత్రి కాన్వాయ్ కు ఎదురుగా గోవు గోశాల నిర్వహకుడు రావడంతో మంత్రి కారు దిగి అతని వద్దకు వెళ్ళాడు. గోశాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని సహాయం చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. గతంలో పలుమార్లు వినతులు సమర్పించిన ఎవరూ పట్టించుకోలేదని, గోవుకు వినతి పత్రం కట్టి మీ దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. గోవు వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి గోవుకు అరటిపండు తినిపించి శ్రీపాద ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని గోశాల నిర్వాహకునికి మంత్రి హామీ ఇచ్చారు.2
- రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం పిప్రిలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. అరైవ్-అలైవ్ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- లక్షెట్టిపేట పట్టణంలోని బీట్ బజార్లో 80 ఫీట్ల రోడ్ల విస్తరణ జరుగుతుందని, అందరూ సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షెట్టి పేట పట్టణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా బీట్ బజార్లో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ జరుగుతుందని, మార్కింగ్ చేసిన భవనాలను 30 లోగా వ్యాపారులు ప్రజలు స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు.1
- ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి,బిజెపి కి షాక్ తగిలింది. ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియా శీలకంగా మండలంలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు.చేరిన వారిలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బజార్ హత్నూర్ గ్రామ మున్నూరుకాపు మాజీ అధ్యక్షులు కొత్త నర్సయ్య, మాజీ వార్డు మెంబెర్ జెన్నేపల్లి రమేష్,గడ్డల గజేందర్,హన్మంతు,గోసుల శేఖర్,యోగేష్,భగత్ సంతోష్,రాజు,ఎల్లయ్య ఉన్నారు. చేరిన వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాక ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊరు మండలం బాగుపడుతుందని అనుకున్నాం కానీ కేవలం కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే బాగు పడుతుందని పేదలు నష్టపోతున్నారని బాధతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో చేరమన్నారు. ముఖ్యమంత్రి మా మండలానికి వస్తే మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ సభ జరిగిన పిప్రి గ్రామ పేరును కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం మమ్మల్ని ఆశ్చర్యనికి గురి చేసిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత క్షేమంగా ఉంటుందో, తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో అంతే క్షేమంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం కుక్కలు చించిన ఇస్తారాకు లాగా మారిందన్నారు. ముఖ్యమంత్రి దత్తత జిల్లా ఆదిలాబాద్, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం పిప్రి వీటినే అభివృద్ధి చేయలేని వారు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయన్న,ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న,బొర్ర రాజు, చట్ల వినీల్,కేసు సకేశ్,బత్తిని మురళి కృష్ణ,తడక శ్రీను తదితరులు పాల్గొన్నారు.1
- *శివసాయి మల్టీ స్పెషలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం* -ఉచిత శిబిరంలో సుమారు 350 మందికి పరీక్షలు, మందులు పంపిణీ, * ఉచిత మెగా హెల్త్ క్యాంపు కు విశేష స్పందన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిభిరాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని గ్రామ సర్పంచ్ బాదావత్ మోతిలాల్ అన్నారు. ఆదివారం భీమ్గల్ శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ అలాగే పిల్లల హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కారేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం గ్రామస్తుల కోరిక మేరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. శివ సాయి ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కారేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ మెగా క్యాంప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని జరపడానికి తన వంతు కృషి కూడా చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ హెల్త్ మెగా క్యాంపును కారేపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా మా ఆస్పత్రికి వస్తున్న గ్రామ గ్రామస్తులకు అన్ని విధాలుగా పరీక్షలు చేయడంతో నమ్మకంతో వైద్య పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపులో సుమారు 200, మంది పెద్దవారికి 150,మంది పిల్లలకు వైద్య పరీక్షలు అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.భీమ్గల్ మండలంలోని ప్రతి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంధన్నారు, ఇలాంటి క్యాంప్ ద్వారా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించ వచ్చు పెద్ద సమస్య ఎదురైతే దానికి తగ్గట్టుగా పెద్ద లెవెల్లో కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుందని అన్నారు. ఆర్థిక సహాయం ఎంత చేసినా కలగని ఆనందం పదిమంది ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే డాక్టర్ లు ప్రజాసేవ చేయాలనే ఆలోచన కలగడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు జి. సూర్యనారాయణ ఎండి. ఎంఎస్. జర్నల్ సర్జరి& ఫిజీషియన్, డాక్టర్ వి.జైపాల్ ఎంబిబిఎస్ డిఎన్బి చిన్నపిల్లల, కే.హైందవి, ఎం ఎస్. ఓబిజి గర్భిణీ స్త్రీ లకు సేవలందిస్తున్న వైద్యురాలు, ఉప సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ వాసు, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, రమేష్, ఆసుపత్రి సిబ్బంది షాబుద్దీన్, ప్రకాష్, రాజు, అలం, అదనాన్, రమ్య,నందిని, మౌనిక, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ, గ్రామ, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.3