మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
- భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- మంథని లో మంత్రి శ్రీధర్ బాబు కు వింత నిరసన ఎదురయింది. గోవు ద్వారా గోశాల నిర్వాహకుడు వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబును ఆ కాలనీలో ఉన్న గౌతమేశ్వర గోశాల నిర్వహకులు ఆకుల విద్యాసాగర్ వినూత్నంగా వినతి పత్రం సమర్పించారు. గోశాల లోని పార్వతి అనే గోవు ద్వారా గోశాల దీనస్థితిని వినతి పత్రం ద్వారా మంత్రికి విన్నవించారు. మంత్రి కాన్వాయ్ కు ఎదురుగా గోవు గోశాల నిర్వహకుడు రావడంతో మంత్రి కారు దిగి అతని వద్దకు వెళ్ళాడు. గోశాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని సహాయం చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. గతంలో పలుమార్లు వినతులు సమర్పించిన ఎవరూ పట్టించుకోలేదని, గోవుకు వినతి పత్రం కట్టి మీ దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. గోవు వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి గోవుకు అరటిపండు తినిపించి శ్రీపాద ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని గోశాల నిర్వాహకునికి మంత్రి హామీ ఇచ్చారు.2
- హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- మెట్పల్లి, ఏప్రిల్ 13: మెట్పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్హెచ్సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- ఎల్లారెడ్డిపేట సబ్స్టేషన్లను తనిఖీ చేసిన టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వ్యవసాయ కనెక్షన్ల మంజూరు వేగవంతం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని 132/33 కెవి , 33/11 కెవి సబ్స్టేషన్లను సోమవారం స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడుతూ పవర్ ఫ్యాక్టర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు . పవర్ ఫ్యాక్టర్ .9 వస్తుందని చెప్పగా , ఇంకా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరచుకోవాలని సూచించారు . ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్ ఉన్న వాటిని బదలాయింపు చర్యలు చేపట్టాలని , అలాగే కెపాసిటర్ బ్యాంకు లు పెట్టాలని అన్నారు . రైతులకు విద్యుత్ అంతరాయాలు కలగకుండా నిరంతరాయంగా సరఫరా అందించాలని ఆదేశించారు . అంతేకాక సబ్స్టేషన్ల యార్డ్ పరిసరాలను అన్నివేళలా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు . విద్యుత్ మౌలిక సదుపాయాల పై సీఎండీ చర్చిస్తూ , వినియోగదారులకు , రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలని చెప్పారు . ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ సెస్ బాధ్యతలు స్వీకరించే సమయానికి (ఏప్రిల్ 1) పెండింగ్లో ఉన్న 2491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులను గుర్తించి , వీటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని , ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు (AEs/ADEs) లక్ష్యాలను నిర్దేశించామన్నారు . కొత్త కనెక్షన్ల కోసం వినియోగదారులు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు . సిరిసిల్ల పట్టణంలోని పవర్ లూమ్ యూనిట్లపై బిల్లింగ్ భారాన్ని తగ్గించేందుకు, వాటి టారిఫ్ కేటగిరీని 'కేటగిరీ-III' నుండి 'కేటగిరీ-IV'కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఇప్పటికే దాదాపు ₹2.0 నుండి ₹2.5 కోట్ల వ్యయంతో సుమారు 80 సంఖ్యలో 33/11 kV సబ్స్టేషన్లను నిర్మించామని వెల్లడించారు . అనవసరమైన ట్రిప్పింగ్లను తగ్గించేందుకు ప్రతి సబ్స్టేషన్లో అత్యాధునిక ట్రాన్స్ఫార్మర్లు , బ్రేకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు . . భవిష్యత్తు అవసరాల కోసం ₹45 కోట్ల అంచనా వ్యయంతో మరో 15 కొత్త సబ్స్టేషన్లను మంజూరు చేశామని చెప్పారు . . వీటిలో కొన్నింటికి ఇప్పటికే ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ పూర్తయిందని , ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు . గతంలో సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2-3 ఫీడర్లను అనుసంధానించడం వల్ల తరచుగా అంతరాయాలు కలిగేవి. దీనిని పరిష్కరించేందుకు ₹1.5 కోట్ల వ్యయంతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని , ఈ పనులు 15-20 రోజుల్లో పూర్తవుతాయని వివరించారు . విద్యుత్ నిరంతరాయంగా అందేలా సుమారు ₹30 కోట్ల వ్యయంతో 33 kV ఇంటర్ లింకింగ్ లైన్లను వేశామని చెప్పారు . . దీనివల్ల ఒక ఫీడర్లో సమస్య వచ్చినా, మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేసే వీలుంటుంది అన్నారు . ఇతర 17 జిల్లాల మాదిరిగానే సిరిసిల్లలో కూడా USLC విధానాన్ని అమలు చేస్తున్నామని , . దీనివల్ల సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు సరళతరం చేయబడ్డాయి . గతంలో వినియోగదారులు చెల్లించే ₹20,000 నుండి ₹60,000 వరకు ఉన్న ORC ఛార్జీలను రద్దు చేశామని చెప్పారు . వినియోగదారులు చెల్లించాల్సిన రుసుము: వ్యవసాయ కనెక్షన్ల కోసం కేవలం కిలోవాట్కు ₹1,000 మాత్రమే అన్నారు . నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే "గృహ జ్యోతి" పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని , అర్హులైన వారు సంబంధిత పత్రాలతో స్థానిక ఏఈ (AE) కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. 'పొలం బాట/ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయడం, మధ్యలో స్తంభాలను ఏర్పాటు చేయడం వంటి పనులను వేగవంతం చేశామని , అత్యవసర పరిస్థితుల కోసం 1000కి పైగా విద్యుత్ స్తంభాలను సిరిసిల్లలో సిద్ధంగా ఉంచామని , కరీంనగర్ స్టోర్స్ నుండి ₹5 కోట్ల విలువైన మెటీరియల్ ఇప్పటికే సిరిసిల్లకు తరలించామన్నారు . అంచనాలు మరియు పనుల అమలులో పారదర్శకత కోసం 'SAP' ఆధారిత సాఫ్ట్ వేర్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చామని , ఉన్నతాధికారులు నిరంతరం సిరిసిల్లలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ను అందించేందుకు ఎన్పీడీసీఎల్ కట్టుబడి ఉందని , ఈ క్రమంలో వినియోగదారులు నెలవారీ విద్యుత్ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించాలని , గృహ జ్యోతి వంటి ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు . సీఎండీ వెంట రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్ ఎన్ అంజయ్య తో పాటు ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం , ఏ ఈ పృథ్విదర్ , ఏ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .1