Shuru
Apke Nagar Ki App…
విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
Anand Anakapalli
విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్. దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.1
- నేపాల్ వరద బాధితులని భారత ప్రభుత్వం ఆదుకుంటుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : నేపాల్లో అనూహ్యంగా వచ్చిన వరదలలో చిక్కుకున్న భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో వెల్లడించారు.అక్కడి పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రోడ్డు, నెట్వర్క్ వ్యవస్థ పునరుద్ధరణ కాగానే సహాయక చర్యలు మరింత వేగవంతం చేసి, బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, సీపీవో ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.1
- ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన గిరిజన మహిళలు.................. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి గిరిజన మహిళలు రాఖీలు కట్టి ఆత్మీయత చాటుకున్నారు. దేవరాపల్లి మండలంలోని గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేను మహిళలు కలిసి రాఖీలు కట్టారు. సోదర భావానికి ప్రతీకగా రాఖీ కట్టిన మహిళలను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, కానుకలు అందజేశారు.1
- రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన1
- ₹4.43 కోట్ల నిధులతో 8 కి.మీ. మేర రహదారి నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు NH-26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్తవలస వరకు ఈ రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల కల నేడు సాకారం కానుంది. రహదారి నిర్మాణం పూర్తయితే విశ్వనాథపురం, కొత్తవలసతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులకు రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది. రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రధాన రహదారులతో గ్రామాలను అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రహదారి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, మెరుగైన రవాణా సౌకర్యాలతో ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజల ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. “అభివృద్ధికి రహదారులే కీలకం.. ప్రతి ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే మా లక్ష్యం” అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ1
- పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- అనారోగ్యం తో మరణించిన నటుడు జీ వి నారాయణరావు మృతి కి ---నివాళి.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్1
- ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి గుర్తు చేసిన ఘోర విపత్తు ఇది… టిబెట్–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం చూస్తుంటే గుండె కలచివేస్తోంది. ఎంతో పటిష్టంగా నిర్మించిన భవనాలు, రహదారులు, పవర్ ప్లాంట్లు, హోటళ్లు… క్షణాల్లో మట్టిలో కలిసిపోయాయి. ఎంతో ప్రేమతో, ఎన్నో సంవత్సరాల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లు… ఊళ్లకు ఊళ్లే ఆనవాళ్లు లేకుండా పోయాయి. మనిషి ఎంత ఆధునిక సాంకేతికతను సాధించినా… ప్రకృతి ఒక్కసారి తన ఉగ్రరూపం చూపితే మనం ఎంత నిస్సహాయులమో ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఈ విపత్తులో ఆస్తులు కోల్పోయిన వారి బాధ ఒకవైపు అయితే, అనేక మంది ప్రాణాలను కోల్పోవడంతో వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న విషాదం మరింత హృదయ విదారకం. నిన్నటి వరకు ఆనందంగా ఉన్న జీవితాలు… ఒక్క క్షణంలో విషాదంగా మారిపోయాయి. జీవితం శాశ్వతం కాదు… మనిషి శాశ్వతం కాదు… మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. కాబట్టి ఉన్నంత కాలం స్వార్థం, ద్వేషం, అహంకారం విడిచి… తోటి మనుషులతో ప్రేమగా, మానవత్వంతో జీవిద్దాం. ఎందుకంటే ప్రకృతి ముందు మనిషి కేవలం ఒక నిమిత్తమాత్రుడే…! 🙏 ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి హృదయపూర్వక నివాళులు. 🕊️ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. 🖋️ దువ్వాడ శ్రీధర్ బాబా 📍 పలాస నియోజకవర్గం1