Shuru
Apke Nagar Ki App…
"మా" అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే వర్ధంతి... మహబూబాబాద్ జిల్లా, మార్చి10, సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ లోని ఆర్ కే నిలయం లో మా అసోసియేషన్ అధ్యక్షులు లయన్ బొడ్డుపల్లి రజిత ఉపేంద్రం అధ్యక్షతన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోలి చంద్రకళ, ఏబిఎస్ఎప్ రాష్ట్ర అధ్యక్షులు ఇనుగుర్తి సుధాకర్, న్యాయవాది దర్శనం రామకృష్ణ, మా అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు, భారతి, ఎల్ఐసి కోశాధికారి తీగల రాజేందర్, ధీరజ్ సుహాస్, ఈషన్, చిన్న కుట్టి తదితరులు పాల్గొన్నారు.
Venkatgoud kallepu
"మా" అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే వర్ధంతి... మహబూబాబాద్ జిల్లా, మార్చి10, సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ లోని ఆర్ కే నిలయం లో మా అసోసియేషన్ అధ్యక్షులు లయన్ బొడ్డుపల్లి రజిత ఉపేంద్రం అధ్యక్షతన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోలి చంద్రకళ, ఏబిఎస్ఎప్ రాష్ట్ర అధ్యక్షులు ఇనుగుర్తి సుధాకర్, న్యాయవాది దర్శనం రామకృష్ణ, మా అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు, భారతి, ఎల్ఐసి కోశాధికారి తీగల రాజేందర్, ధీరజ్ సుహాస్, ఈషన్, చిన్న కుట్టి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ:ఎల్కతుర్తి మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యాచరణపై సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని, స్థానిక మరియు మండల అధికారులతో ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో అధికారులు ప్రస్తుత ప్రణాళిక కింద చేపట్టిన పనుల రిపోర్ట్ను వివరించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛత, పౌరసౌకర్యాలు, మరియు ప్రభుత్వ సేవల అందుబాటులో ఉన్నత ప్రమాణాలను నిర్ధారించడంలో ప్రగతి ఏ స్థాయిలో ఉందో గుర్తించబడింది. మంత్రి ప్రభాకర్ సమావేశంలో భాగంగా అధికారులకు సమగ్ర మార్గదర్శక సూచనలు ఇచ్చారు మరియు ఈ కార్యక్రమం పూర్ణవంతంగా అమలు కావడానికి చర్యలను వేగవంతం చేయాలని దృష్టి పెట్టారు. మంత్రి మాట్లాడుతూ, “ప్రజాపాలనలో పారదర్శకత మరియు సమయపాలన ప్రధానమైన అంశాలు. ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా మేము ప్రతీ గ్రామానికి సమగ్రమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం” అని అన్నారు.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్లోని ఎల్ఎం–6, ఎల్ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.4
- *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- వరంగల్: గీసుకొండ మండలం మొగిలిచర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం పంట పొలానికి వెళ్లిన గాద శ్రీను అనే రైతు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పందులను అడ్డుకునేందుకు బండారు కొమురయ్య పొలంలో కరెంట్ తీగలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహంతో అతని ఇంటి ముందు ధర్నా చేపట్టారు. కేసు నమోదు చేసిన ఏనుమాముల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1