Shuru
Apke Nagar Ki App…
బీసీ ల పాదయాత్ర 💐💐💐💐💐✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻 *గోల్కొండ కోట సాక్షిగా.. ప్రజా చైతన్య శంఖారావం! తీన్మార్ మల్లన్న గారి 14,000 కి.మీ. మహా పాదయాత్రకు శుభాకాంక్షలు!"* *"లక్ష్యం 14,000 కిలోమీటర్లు.. ఆశయం ప్రజా సంక్షేమం! గోల్కొండ గడ్డ పైనుంచి కదిలిన సింహం.. మల్లన్న అడుగులో అడుగేసి నడుద్దాం, మార్పు వైపు సాగుదాం!"* *కోటల సాక్షిగా మొదలైన ప్రజా పోరాటం.. పల్లె పల్లెను మేల్కొలిపే చైతన్య గీతం! జనం కోసం, జనం నడుమ సాగే మల్లన్న మహా పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ..."* మీ.. *బండి సునీల్ కుమార్ యాదవ్* జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ
బండి సునీల్ కుమార్
బీసీ ల పాదయాత్ర 💐💐💐💐💐✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻 *గోల్కొండ కోట సాక్షిగా.. ప్రజా చైతన్య శంఖారావం! తీన్మార్ మల్లన్న గారి 14,000 కి.మీ. మహా పాదయాత్రకు శుభాకాంక్షలు!"* *"లక్ష్యం 14,000 కిలోమీటర్లు.. ఆశయం ప్రజా సంక్షేమం! గోల్కొండ గడ్డ పైనుంచి కదిలిన సింహం.. మల్లన్న అడుగులో అడుగేసి నడుద్దాం, మార్పు వైపు సాగుదాం!"* *కోటల సాక్షిగా మొదలైన ప్రజా పోరాటం.. పల్లె పల్లెను మేల్కొలిపే చైతన్య గీతం! జనం కోసం, జనం నడుమ సాగే మల్లన్న మహా పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ..."* మీ.. *బండి సునీల్ కుమార్ యాదవ్* జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ
More news from తెలంగాణ and nearby areas
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో ప్రారంభం.... విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యూట్రిషన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రేక్ ఫాస్ట్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో 8 కోట్లతో జిల్లాలోని 49 వేల మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రమిశ్రా, హరేకృష్ణ ఫౌండేషన్ సిఈవో కౌంటియా దాస స్వామీజీ తో కలిసి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన భారీ కిచెన్ ను పరిశీలించారు. ఇడ్లీ, దోశ, పూరీ, సాంబార్, బోండా తయారీ మిషన్లు, పాత్రలు క్లీన్ చేసే మిషన్లు ,పాల కేంద్రం ,ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్ లను, వెజిటేబుల్ కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు , చట్నీ పౌడర్ తయారీ మిషన్ల పనితీరును పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఆరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించామని ఈ కిచెన్ ద్వారా జిల్లాలోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11జూనియర్ కళాశాలల విద్యార్థులకు పోషకాలతో కూడిన బ్రెక్ ఫాస్ట్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 లక్షల 72 వేల 291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 23106 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు 31 జిల్లాల్లో 31 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 1400 పంపిణీ వాహనాలు, 5,000 మంది సిబ్బంది, కేంద్రీకృత వంటశాలల ద్వారా సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలున్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం భూములు ఇచ్చేలాంటి పథకాలు అమలు చేసిందని ప్రస్తుతం భూములు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన పథకాలతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే తమ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. డ్రాప్స్ లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామని త్వరలో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అమలు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ముందుగా కొడంగల్ లో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయడంతో 75 నుంచి 90% ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెరిగిందని స్పష్టం చేశారు. పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. బకాయి ఫీజు రియంబర్స్మెంట్ సైతం త్వరలోనే క్లియర్ చేస్తామని, విజిలెన్స్ విచారణ అనంతరం బకాయిలన్నీ క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై అసెంబ్లీ లో సీఎం క్లారిటీగా చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.4
- కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభవార్త చెప్పారు..! డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వచ్ఛ భారత్ పథకం కింద ఇప్పటికే 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యూసీఎఫ్ నిధుల నుంచి మరో 80 కోట్ల రూపాయలను డంపింగ్ యార్డ్ కోసం వెచ్చిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్లో 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రెయిన్లు, పైప్లైన్లు, ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు. గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం.. ప్రతి డివిజన్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు. యూసీఎఫ్ కింద కరీంనగర్కు మొత్తం 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నామని.. కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్కు టెండర్లు.. యూసీఎఫ్ నుంచి మరో 80 కోట్లు.. కరీంనగర్ అభివృద్ధికి భారీ ప్రణాళిక..!3
- శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- ఎస్సై వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు,అప్రమత్తంగా విధులు నిర్వహించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో డీసీపీలు,అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పోలీస్ స్టేషన్,డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు,పోక్సో కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు,గంజాయి కేసులు,రోడ్డు ప్రమాద కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పాత కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ వారీగా ఆన్లైన్లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు. నేరాల నియంత్రణకు అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కూడా చర్చించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకునే పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలు కూడా పోలీసులకు తెలిసే విధంగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో,ఎస్సీ,ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు పెండింగ్లో లేకుండా చూడాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వారానికోసారి సమీక్షించాలని సూచించారు. ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని,సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో కనిపించే విధంగా పోలీసింగ్, విస్తృతంగా గస్తీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలతో సంబంధాలను మరింత పెంచాలని ఆదేశించారు. మహిళలు,బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను నిర్దేశిత కాలపరిమితిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, వినాయక మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తుతో పాటు కోర్టు కేసుల పరిష్కారంపై కూడా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి,నేర నిర్ధారణ శాతాన్ని పెంచేందుకు డీసీపీలు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.కోర్టు కేసుల పురోగతిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను (ఎన్బీడబ్ల్యూ) ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ సరఫరా,రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదృశ్యమైన వ్యక్తుల కేసులను డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.ఆర్థిక నేరాల్లో నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేర విభాగం పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని సూచించారు.డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని, ఫిర్యాదు నిజమని తేలితే కేసు నమోదు చేయాలని,తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్కుమార్, టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డితో పాటు ఇతర సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు,ఎస్ఐలు పాల్గొన్నారు.1
- పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద బహుమతి.. నాణ్యమైన విద్య.. పోషకాహారం..!” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆకలితో ఉన్న పిల్లవాడు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేడు..! అందుకే ఉదయం పూటే విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. చదువు కోసం పుస్తకాలు ఇస్తున్నాం..! చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం..! ఇప్పుడు ఆకలి లేకుండా చదువుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం..! ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మౌలిక వసతులతో పాటు ట్రెయిన్డ్ టీచర్లు, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్లోని ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా రోజుకు 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం అందుతుందని చెప్పారు. “ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే తల్లిదండ్రుల మద్దతు కూడా అవసరం.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ప్రోత్సహించాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. “ఈరోజు విద్యార్థులకు అందుతున్న ఈ అల్పాహారం.. రేపటి వారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి..!” అని మంత్రి ఆకాంక్షించారు.4
- నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.1