ఇఫ్తార్ విందుకు హాజరైన డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఉప్పొంగిన అభిమానం. బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఇఫ్తార్ విందుకు హాజరైన డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు
తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఉప్పొంగిన అభిమానం. బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే
ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
- GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన గుంటూరు (అర్బన్): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: * లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం. * రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- *బ్రేకింగ్ న్యూస్..* గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు.. ఏడుగురు సభ్యులతో కేంద్ర బృందం తనిఖీలు.. మీడియా నిరాకరించిన వైనం.. ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ ఆంక్షలు.. గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్న కేంద్ర బృందం.1
- రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.1
- రాజంపేటలో *ఇంత శాడిస్ట్ గానికి ఈ సమాజం లో బతికే అర్హత లేదు* *మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి* *భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అడ్డుకోవాల్సిన భర్తే ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత దారుణం* *కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన శాడిస్ట్ భర్త శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది* *శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్ ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు* *ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది* ఈ శాడిస్ట్ గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే వంకలో, నదులల్లో దూకి చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి1
- Post by వేముల నాగరాజు4
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)1
- గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ. గ్యాస్ సప్లయ్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లై లో వ్యత్యాసం వేస్తోందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.1
- *ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక ఎం ఆర్ సి ప్రాంగణంలో చౌడేపల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కేశవరెడ్డి గారు మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషిచేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిపాధ్యాయురాలు అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియచేసారు. ఎంఈఓ 2 శ్రీమతి తిరుమలమ్మ గారు మాట్లాడుతూ మహిళల పైన జరుగుతున్న దాడులను అణచివేయుటకు చట్టాలు ఇంకా కట్టిన తరం చేయాలని సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు లింగమూర్తి, శ్రీనివాసులు మరియు వసంతమ్మ, సూర్య ప్రకాష్, వినోద్ కుమార్, గిరి మాట్లాడుతూ నేటి మహిళలు భూమి నుండి ఆకాశం వరకు అన్ని రంగాలలోనూ ముందున్నప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో మహిళా సాధికారత సాధించాలని అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుమలమ్మ , సీనియర్ మహిళా ఉపాధ్యాయిని స్వరూపారాణి గార్లను సత్కరించడమైనది.* *ఈ కార్యక్రమంలో ఎస్టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లింగమూర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సహదేవ, నాయకులు బాబు రమేష్, సుధాకర్ నాయుడు, మురళీమోహన్, నాగరత్నమ్మ, సుమిత్ర, స్రవంతి , గణేష్, కృష్ణవేణి, మురళి, జగన్నాథ రాజు, సబ్బీర్ అహమద్, అంజలి, శంకర ,రమేష్, తులసి రామ్ మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు*1