రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ళ వాన బీభత్సం...పంట నష్టాన్ని చూసి బోరున విలపిస్తున్న రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది. వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ళ వాన బీభత్సం...పంట నష్టాన్ని చూసి బోరున విలపిస్తున్న రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో
చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది. వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు
గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు
స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.
- బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.2
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.3
- గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.4
- Post by Tagore1
- భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది. వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.4