logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్* కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్* *కాగజ్‌నగర్:* మే 1 మేడే సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 5 నుండి 7 గంటల వరకు వివిధ రంగాల యూనియన్లు తమ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశాయి. 8 గంటలకు స్టేట్ బ్యాంక్ ముందు నుండి భారీ ర్యాలీ ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా, మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి భారీ సభగా మారింది. సభలో *CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. త్రివేణి* మాట్లాడుతూ.. మే 1 చరిత్రలో గొప్ప పోరాట దినమని, చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకున్నామన్నారు. కార్మిక హక్కులు పోరాటాల ద్వారానే వచ్చాయని, మేడే జ్ఞాపక దినం కాదు భవిష్యత్తు పోరాటాల సంకల్ప దినమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులపై దాడి చేస్తున్నాయని ఆమె విమర్శించారు. పని గంటల పెంపు, కనీస వేతనాలు లేకపోవడం, సమ్మె హక్కుపై పరిమితులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల పెరుగుదల కార్మికులను అసురక్షితం చేస్తున్నాయని అన్నారు. ఇవి కార్మిక సంక్షేమం కాదు, కార్పొరేట్ లాభాల కోసమే అని ఆరోపించారు. అసంఘటిత, ఔట్‌సోర్సింగ్, మహిళలు, యువతపై లేబర్ కోడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించిన త్రివేణి, కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ. శంకర్, సర్దార్ బస్తీలో కె. శ్రీనివాస్, CITU కార్యాలయం వద్ద ఎం. ఆనంద్ కుమార్ సహా పలువురు యూనియన్ నేతలు జెండాలు ఆవిష్కరించారు. సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ నేతలు కుశన్ రాజన్న, చెంద్రన్న, సంజీవ్, వై. అరుణతో పాటు హమాలీ, బిల్డింగ్, SPM, మున్సిపల్, ఆశ, అంగన్వాడీ, MDM కార్మికులు భారీగా పాల్గొన్నారు.

2 hrs ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago

కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్* కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్* *కాగజ్‌నగర్:* మే 1 మేడే సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 5 నుండి 7 గంటల వరకు వివిధ రంగాల యూనియన్లు తమ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశాయి. 8 గంటలకు స్టేట్ బ్యాంక్ ముందు నుండి భారీ ర్యాలీ ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా, మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి భారీ సభగా మారింది. సభలో *CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. త్రివేణి* మాట్లాడుతూ.. మే 1 చరిత్రలో గొప్ప పోరాట దినమని, చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకున్నామన్నారు. కార్మిక హక్కులు పోరాటాల ద్వారానే వచ్చాయని, మేడే జ్ఞాపక దినం కాదు భవిష్యత్తు పోరాటాల సంకల్ప దినమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులపై దాడి చేస్తున్నాయని ఆమె విమర్శించారు. పని గంటల పెంపు, కనీస వేతనాలు లేకపోవడం, సమ్మె హక్కుపై పరిమితులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల పెరుగుదల కార్మికులను అసురక్షితం చేస్తున్నాయని అన్నారు. ఇవి కార్మిక సంక్షేమం కాదు, కార్పొరేట్ లాభాల కోసమే అని ఆరోపించారు. అసంఘటిత, ఔట్‌సోర్సింగ్, మహిళలు, యువతపై లేబర్ కోడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించిన త్రివేణి, కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ. శంకర్, సర్దార్ బస్తీలో కె. శ్రీనివాస్, CITU కార్యాలయం వద్ద ఎం. ఆనంద్ కుమార్ సహా పలువురు యూనియన్ నేతలు జెండాలు ఆవిష్కరించారు. సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ నేతలు కుశన్ రాజన్న, చెంద్రన్న, సంజీవ్, వై. అరుణతో పాటు హమాలీ, బిల్డింగ్, SPM, మున్సిపల్, ఆశ, అంగన్వాడీ, MDM కార్మికులు భారీగా పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. దాదానగర్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని ఆపి తనిఖీ చేయగా 700 దేశీ దారు బాటిళ్లు (సుమారు 63 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ.25,200గా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    1
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. దాదానగర్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని ఆపి తనిఖీ చేయగా 700 దేశీ దారు బాటిళ్లు (సుమారు 63 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ.25,200గా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ నగరంలోని శుభాష్ నగర్‌లో ఉన్న కార్మిక సంఘ కార్యాలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (BRTU) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MLC నరదాసు లక్ష్మణ్ రావు, BRS మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణలో BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS మైనారిటీ నాయకులునాఇమ్,మొబీన్,BRS విద్యార్థి నాయకులు, బొంకూరి మెహన్, భావన నిర్మాణ సంఘం సభ్యులు పులిపాక లక్ష్మణ్, కొమ్ము రమేష్, నీర్ల శ్రీనివాస్, గంగాధర శంకర్, ఆశీర్వాదం, మొదుంపెల్లి శంకరయ్య, గంట లక్ష్మణ్, చిప్ప శ్రీనివాస్, బత్తుల అనిల్ రాజ్ పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నగరంలోని శుభాష్ నగర్‌లో ఉన్న కార్మిక సంఘ కార్యాలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (BRTU) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MLC నరదాసు లక్ష్మణ్ రావు, BRS మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్  మే డే జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణలో BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
అనంతరం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో BRS మైనారిటీ నాయకులునాఇమ్,మొబీన్,BRS విద్యార్థి నాయకులు, బొంకూరి మెహన్, భావన నిర్మాణ సంఘం సభ్యులు పులిపాక లక్ష్మణ్, కొమ్ము రమేష్, నీర్ల శ్రీనివాస్, గంగాధర శంకర్, ఆశీర్వాదం, మొదుంపెల్లి శంకరయ్య, గంట లక్ష్మణ్, చిప్ప శ్రీనివాస్, బత్తుల అనిల్ రాజ్ పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • हैदराबाद से विशेष रिपोर्ट तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया। पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया। सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।
    1
    हैदराबाद से विशेष रिपोर्ट  
तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया।  
पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया।  
सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    5 hrs ago
  • ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
    1
    ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు మనసా దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు శుక్రవారం వేడుకల్లో భాగంగా అన్నపూర్ణాదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, శ్రీ చక్రానికి ఒక లక్ష ఎనిమిది వేల నాణములతో అభిషేకం నిర్వహించారు. 108 కళాశాలతో మానసా దేవి అమ్మవారికి అభిషేకం చేశారు. చండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వైశాఖ పౌర్ణమి కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు మనసా దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు శుక్రవారం వేడుకల్లో భాగంగా అన్నపూర్ణాదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, శ్రీ చక్రానికి ఒక లక్ష ఎనిమిది వేల నాణములతో అభిషేకం నిర్వహించారు. 108 కళాశాలతో మానసా దేవి అమ్మవారికి అభిషేకం చేశారు. చండీ హోమం, కుంకుమార్చనలు  నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వైశాఖ పౌర్ణమి కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం *బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి: - *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ - *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ - *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య - *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు - *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత - *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్ - *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య - *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్ సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు
    1
    :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం
*బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. 
బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి:
- *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్
- *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ 
- *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య
- *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు
- *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత
- *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్
- *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య
- *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్
సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 
కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధరకు మక్కజొన్న కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    1
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధరకు మక్కజొన్న కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    2
    డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు 
కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.