Shuru
Apke Nagar Ki App…
మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.
MERCY
మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.
More news from తెలంగాణ and nearby areas
- మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.2
- ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్లోకి చేరికలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరిన మోడేగావ్ గ్రామ సర్పంచ్ కౌడెల్లి గంగాధర్తో పాటు పలువురు* సదాశివనగర్ మండలం మోడేగావ్ గ్రామానికి చెందిన సర్పంచ్ *కౌడెల్లి గంగాధర్*తో పాటు *జువ్వాడ భిక్షపతి, దాసరి భాస్కర్, పెద్ద రాజయ్య, జువ్వల శ్రీనివాస్, బెస్త రాములు* తదితరులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే *మదన్ మోహన్ గారి* నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. *కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని* ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ముఖ్యంగా **ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్** వంటి సంక్షేమ కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి చొరవతో *మోడేగావ్ గ్రామంలో *రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం*, *రూ.10 లక్షలతో స్వయం సహాయక సంఘాల (SHG) భవనానికి నిధుల మంజూరు*తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమను ఆకర్షించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేస్తున్న కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. మోడేగావ్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షులు గ్రామ ఉపసర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.3
- కామారెడ్డి మెడికల్ సెంటర్లోనిర్వహించిన ప్రెస్ మీట్లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు. నిజామాబాద్కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్లేట్లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్లో జరిగిన ఈ ప్రెస్ మీట్లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.2
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- పటాన్చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పటాన్చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వై జంక్షన్ మూసివేతపై బీజేపీ నేతలు–పోలీసుల మధ్య వాగ్వాదం రామాయంపేట: 44వ జాతీయ రహదారిపై రామాయంపేట వై జంక్షన్ వద్ద వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు రహదారి మూసివేతకు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రోడ్డును మూసివేయడంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు బీజేపీ నాయకులు రహదారిని మూసివేయగా, అక్కడికి చేరుకున్న సీఐ సైదా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా జాతీయ రహదారిని ఎలా మూసివేస్తారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వై జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తమ దృష్టిలో ఉందని సీఐ తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.1