కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో ఉచిత అంత్యక్రియల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఈరోజు స్వర్గస్తులైన గంగాధర భూలక్ష్మి అనే వృద్ధురాలు మరణించగా ఆమె అంత్యక్రియలకు అగు ఖర్చు మొత్తం సర్పంచ్ దాసరి శంకరయ్య ట్రస్ట్ ద్వారా నిర్వహించారు. గ్రామంలో ఎవరు మరణించిన ట్రస్ట్ ద్వారా ఉచిత అంత్యక్రియలతో పాటు ఆరోజు వచ్చినవారికి అన్నదానం చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమం స్థానిక సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించనైనది. దహన సంస్కారాల కైనా ఖర్చు మొత్తాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందించారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలనే సంకల్పంతో ఉచిత అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సర్పంచ్ దాసరి శంకరయ్య వివరించారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం మానవత ధర్మంగా తాను భావించి ఈ ఉచిత అంత్యక్రియల కార్యక్రమానికి నిర్వహించడం గ్రామప్రజల సహకారంతో జరుగుతుందని గ్రామ సర్పంచి తెలియజేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో ఉచిత అంత్యక్రియల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఈరోజు స్వర్గస్తులైన గంగాధర భూలక్ష్మి అనే వృద్ధురాలు మరణించగా ఆమె అంత్యక్రియలకు అగు ఖర్చు మొత్తం సర్పంచ్ దాసరి శంకరయ్య ట్రస్ట్ ద్వారా నిర్వహించారు. గ్రామంలో ఎవరు మరణించిన ట్రస్ట్ ద్వారా ఉచిత అంత్యక్రియలతో పాటు ఆరోజు వచ్చినవారికి అన్నదానం చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమం స్థానిక సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించనైనది. దహన సంస్కారాల కైనా ఖర్చు మొత్తాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందించారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలనే సంకల్పంతో ఉచిత అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సర్పంచ్ దాసరి శంకరయ్య వివరించారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం మానవత ధర్మంగా తాను భావించి ఈ ఉచిత అంత్యక్రియల కార్యక్రమానికి నిర్వహించడం గ్రామప్రజల సహకారంతో జరుగుతుందని గ్రామ సర్పంచి తెలియజేశారు.
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- Post by Ravi Poreddy1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- జనగామ జిల్లా చిల్పూర్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- మడికొండ టెక్స్టైల్ పార్క్లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2