Shuru
Apke Nagar Ki App…
రాయదుర్గం: పురాతన శివాలయం జంబుకేశ్వరుడు ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ,రక్షాబంధనం కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితులు రామకృష్ణ తెలిపారు. స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి కుమ్మరి వీధి వరకు ఊరేగించి రక్షాబంధన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సూర్యప్రభ వాహనోత్సవం పై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
PHANI JOURNALIST
రాయదుర్గం: పురాతన శివాలయం జంబుకేశ్వరుడు ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ,రక్షాబంధనం కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితులు రామకృష్ణ తెలిపారు. స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి కుమ్మరి వీధి వరకు ఊరేగించి రక్షాబంధన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సూర్యప్రభ వాహనోత్సవం పై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఏపీ పునర్విభజన చట్టం సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యాన్ని ఆయన వివరించారు.విభజన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతి అత్యంత పవిత్రమైన నేల అని ఆయన కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.1
- శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed1
- కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు చేశారు.కార్యాలయ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసారు. ఈసీ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ను కలవాలని మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్టర్ లో హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు. సంబంధిత ఈసీ, ఆర్ హెచ్చ్ తదితర సేవలకు రేట్లను కనిపించే విధంగా బోర్డు పెట్టాలని సూచించారు.రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేశారు.2
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.1
- గద్వాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీసీతారాముల వారి కళ్యాణం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ఆధ్వర్యములో అంగరంగ వైభోగంగా జరుపడం జరిగింది. ----->>>>----<<<<----- జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రము శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణములో ఆర్యవైశ్య పట్టణ సంగం అధ్యక్షులు, ఆర్యవైశ్య యువజన సంగం సభ్యుకు పట్టన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగింది.1
- Gadwal: శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా నీలహల్లి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఇతర వసతి ఏర్పాట్లు చేశారు. గ్రామంలో శ్రీరామ నామ స్మరణతో భక్తి పారవశ్యం నెలకొంది. కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల గ్రామానికి శుభం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2
- రాయదుర్గం మండలం బానేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ రథం ఊరేగింపుగా సాగగా, గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1