సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడికి డైరెక్టర్లకు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులచే ఘన సన్మానం ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సబ్బని హరీష్ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు నూతన అధ్యక్షుడు సబ్బని హరీష్ తో 3 వ, 4వ వార్డు డైరెక్టర్ లు కోడం హరీష్, మానాల అరుణ్ కుమార్ లను శాలువాలతో సత్కరించి అభినందిస్తూ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలి యువత ఐక్యతను మరింత బలోపితం చేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. యువత ను వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తు వివిధ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించడంతో పాటు, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా పద్మశాలి యువజన సంఘం కార్యకలాపాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడికి డైరెక్టర్లకు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులచే ఘన సన్మానం ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సబ్బని హరీష్ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు నూతన అధ్యక్షుడు సబ్బని హరీష్ తో 3 వ, 4వ వార్డు డైరెక్టర్ లు కోడం హరీష్, మానాల అరుణ్ కుమార్ లను శాలువాలతో సత్కరించి అభినందిస్తూ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలి యువత ఐక్యతను మరింత బలోపితం చేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. యువత ను వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తు వివిధ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించడంతో పాటు, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా పద్మశాలి యువజన సంఘం కార్యకలాపాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
- *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.4
- మల్లారెడ్డి మరణం పేద ప్రజలకు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నేత,రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం పేద ప్రజలకు, దేశ రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం ఎదుట పార్టీ జెండాను అవనతం చేసి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారూ ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..... హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మూడు గంటలకు సారంపల్లి మల్లారెడ్డి ( 88) తుది శ్వాస విడిచారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని, అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి దగ్గర సలహాలు, సూచనలు తీసుకునే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని మల్లారెడ్డి మృతికి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలో రైతు ఉద్యమాలలో సారంపల్లి మల్లారెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల పోరాటంలో, భూ నిర్వాసితుల ఆందోళన పోరాటాల్లో, ప్రాజెక్టుల సాధనలో, పాదయాత్రలో పాల్గొన్నారు గుర్తు చేశారు. జిల్లాతో మూడు దశాబ్దాల కాలం పాటు పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. వరంగల్ జిల్లాలో పుట్టిన మల్లారెడ్డి ఆ జిల్లాలో సిపిఎం పార్టీ నిర్మాణంలో రైతు సంగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకునిగా నిరాడంబరమైన జీవితం గడిపారని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. వారి స్ఫూర్తితో జిల్లాలో బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి,గుడికందుల సత్యం, కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, డి నరేష్, కొప్పుల శంకర్, నాయకులు గజ్జల శ్రీకాంత్, అరవింద్, సంధ్య, రజిత, ఇసాక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.3
- మంథనిలో హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.. మంథని లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. 19 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు ఉదయం పూట పోషకాలతో కూడిన అల్పాహారం అందించడం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం హరే కృష్ణ ట్రస్ట్ సంయుక్తంగా బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకుని తమ మేధాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు. మొదట కొడంగల్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు మంథని ప్రారంభం కాగా,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ పాఠశాలలో చదివి పేద విద్యార్థుల కోసం, వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలో చేరి బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ ,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.1
- యాప్ ఉంటేనే.. ఎరువులా? రూ.30 వేల ఫోన్ ఉంటేనే బుకింగ్.. రెండు బస్తాల కోసం పొరుగు మండలాలకు పరుగులు వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపు మెదక్ జిల్లా, నిజాంపేట: యూరియా, డీఏపీ కోసం రైతులు అల్లాడుతుంటే యాప్ల పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులు పెడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి మండిపడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ.30 వేల 5జీ ఫోన్ ఉంటేనే ఎరువులు బుక్ చేసుకోవాలనడం పేద రైతులపై భారం మోపడమేనన్నారు. ఎరువుల పంపిణీని జిల్లా యూనిట్గా మార్చడంతో రెండు బస్తాల కోసం రాయ్కోడ్, అల్లాదుర్గ్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు రూ.వెయ్యి వరకు ఆటో చార్జీలు ఖర్చవుతున్నాయని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, దయాకర్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్, సంపత్ తదితరులు ఉన్నారు.2
- *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు* గారు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో *ఫీజుల బకాయి - బీజేపీ లడాయి* మీద నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు.1
- ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ నర్సింలు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు .లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఉన్నారు.1
- మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఫీజు బకాయిలు చెల్లించాలని బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన.... కామారెడ్డి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు1
- *కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.1