Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సోమవారం తాంసి మండలంలోని కప్పర్ల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని గ్రామస్తులకు కలెక్టర్ సూచించారు.
Mallaiah Potta
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సోమవారం తాంసి మండలంలోని కప్పర్ల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని గ్రామస్తులకు కలెక్టర్ సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- 𝐀 𝐝𝐚𝐲 𝐥𝐚𝐭𝐞, 𝐛𝐮𝐭 𝐭𝐡𝐞 𝐡𝐲𝐩𝐞 𝐢𝐬 𝐚𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞𝐥𝐲 𝐰𝐨𝐫𝐭𝐡 𝐢𝐭. 🚀 From becoming the first country to land near the Moon’s South Pole to reaching Mars on our very first attempt, India’s space journey is rewriting history. AND THE BEST PART? 𝐖𝐞’𝐫𝐞 𝐨𝐧𝐥𝐲 𝐠𝐞𝐭𝐭𝐢𝐧𝐠 𝐬𝐭𝐚𝐫𝐭𝐞𝐝. 😎 📈1
- ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం................. ఆదిలాబాద్ రూరల్ మండలంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. రూరల్ మండలంతో పాటు పోచ్చర, రాంపూర్, చందా గ్రామాల్లో వర్షం కురియడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.1
- ఆడే గజేందర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్ అదిలాబాద్, నేరడిగొండ: బోథ్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలను ఆదివారం నేరడిగొండలోని సూర్య ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి గౌతమ బుద్ధుడు, డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి అభినందించారు. ఆడే గజేందర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ ప్రజాసేవలో చురుకుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దుర్గం శేఖర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపిడి రుక్మారెడ్డి, బోథ్ సర్పంచ్ కుర్మే మహేందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీకర్ గౌడ్, బోథ్ మండల కన్వీనర్ భోజన్న, సర్పంచ్ సొంపల్లి లక్ష్మీకాంత్, నాగాపూర్ మాజీ ఉప సర్పంచ్ ఏరుకొండ విజయ్ సాగర్, మాధస్తూ మహేందర్, ఆడే రఘునాథ్, భీంరావ్, విజయ్ దానిపాల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆడే గజేందార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సాజిద్ ఖాన్ ఆడే గజేందార్కు జన్మదిన శుభాకాంక్షలు ఆదిలాబాద్: బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో గజేందార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.1
- గుంతలు.. బురదతో ప్రజలకు అవస్థలు . గుడిహత్నూర్ మండలంలోని తోయగూడ గ్రామ రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాలకు బురదమయంగా మారడంతో నడిచేందుకు కూడా వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులపై మొరం మట్టి పోసి మరమ్మతులు చేపట్టాలని కోరారు.1
- అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు...... జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది. బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.1
- కొండచిలువను సురక్షితంగా పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది..... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామంలో ఒక ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించడంతో అటవీ శాఖ రెస్క్యూ బృందం తక్షణమే స్పందించింది. రెస్క్యూ పరికరాల సహాయంతో ఎలాంటి హాని కలగకుండా కొండచిలువను సురక్షితంగా బంధించారు. అనంతరం దీనిని సమీప రక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కొండచిలువలు కనిపిస్తే హాని చేయకుండా వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రేంజ్ అధికారి అస్మా, ఫారెస్ట్ బీట్ అధికారి సతీష్, యానిమల్ ట్రాకర్స్ రాజు, రామయ్య, నందు నాయక్, వసంత్ పాల్గొన్నారు1
- ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సోమవారం తాంసి మండలంలోని కప్పర్ల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని గ్రామస్తులకు కలెక్టర్ సూచించారు.1