పాడి చెరువుకు మట్టి మాఫియా పంజా! 25 రోజులుగా జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తవ్వకాలు అనుమతులు ఉన్నాయంటున్నారు.. పత్రాలు మాత్రం కనిపించవు తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి అనంతరం ఉన్న పాడి చెరువులో 25 రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి 10 ట్రాక్టర్ల వరకు మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చెరువు స్వరూపం మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు చెబుతున్నప్పటికీ, అనుమతి పత్రాలు, తవ్వకాలకు అనుమతించిన పరిమాణం వంటి వివరాలు వెల్లడించడం లేదని స్థానికులు అంటున్నారు. అనుమతుల పరిధిలోనే తవ్వకాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతుల వివరాలను వెల్లడించాలని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పాడి చెరువుకు మట్టి మాఫియా పంజా! 25 రోజులుగా జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తవ్వకాలు అనుమతులు ఉన్నాయంటున్నారు.. పత్రాలు మాత్రం కనిపించవు తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి అనంతరం ఉన్న పాడి చెరువులో 25 రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి 10 ట్రాక్టర్ల వరకు మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చెరువు స్వరూపం మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు చెబుతున్నప్పటికీ, అనుమతి పత్రాలు, తవ్వకాలకు అనుమతించిన పరిమాణం వంటి వివరాలు వెల్లడించడం లేదని స్థానికులు అంటున్నారు. అనుమతుల పరిధిలోనే తవ్వకాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతుల వివరాలను వెల్లడించాలని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- *పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. *పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- టీటీడీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా..? ఆ పోరులో డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్ను టార్గెట్ చేశారా..? టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్పై జరిగిన ఏసీబీ దాడుల వెనుక కుట్ర ఉందంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80 మంది అధికారులతో ఆరు నెలలపాటు విచారణ జరిపినా ఏమీ తేలలేదని, ఇప్పుడు నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న లోకనాథం యాదవ్ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక టీటీడీలో జరుగుతున్న ఆధిపత్య పోరే కారణమా అని ప్రశ్నించారు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది” అంటూ భూమన తీవ్రంగా వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రాబల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే లోకనాథం యాదవ్ను టార్గెట్ చేస్తున్నారని భూమన ఆరోపించారు. లోకనాథం యాదవ్ కుటుంబం మొదటి నుంచే ఆర్థికంగా సంపన్నమైన కుటుంబమని, ఆయన తాత మునిస్వామి యాదవ్ అప్పట్లోనే కోటీశ్వరుడని పేర్కొన్నారు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న నిజాయితీపరుడైన అధికారిపై అవినీతి మచ్చ వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “లోకనాథం యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీటీడీ ఉద్యోగులు ఆయనకు అండగా నిలవాలి. అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రశ్నించాలి” అని భూమన పిలుపునిచ్చారు. టీటీడీలో అసలు ఏం జరుగుతోంది..? అధికారుల మధ్య ఆధిపత్య పోరా..? లేక లోకనాథం యాదవ్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా..? ▶️ భూమన కరుణాకర్ రెడ్డి గారి సంచలన ప్రెస్మీట్ పూర్తి వీడియో చూడండి.1
- పాడి చెరువుకు మట్టి మాఫియా పంజా! 25 రోజులుగా జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తవ్వకాలు అనుమతులు ఉన్నాయంటున్నారు.. పత్రాలు మాత్రం కనిపించవు తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి అనంతరం ఉన్న పాడి చెరువులో 25 రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి 10 ట్రాక్టర్ల వరకు మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చెరువు స్వరూపం మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు చెబుతున్నప్పటికీ, అనుమతి పత్రాలు, తవ్వకాలకు అనుమతించిన పరిమాణం వంటి వివరాలు వెల్లడించడం లేదని స్థానికులు అంటున్నారు. అనుమతుల పరిధిలోనే తవ్వకాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతుల వివరాలను వెల్లడించాలని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు పట్టణంలో ర్యాలీ అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం పీలేరు: అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు. పీలేరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుజరిగాయి. భారీ బైక్ ర్యాలీ ,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీలేరులో జనసేన కార్యకర్తలు ఉదయం 6 గంటలకు ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అనంతరం పీలేరు HP పెట్రోల్ బంక్ నుండి యల్లమంద cross వరకు జనసేనకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి TV లో PAC చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన జై కొట్టు (యువజన విభాగ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కలప రవి, బాటసారి జిల్లా కార్యదర్శి, మోహనకృష్ణ పీలేరు మండల అధ్యక్షులు, గురు మోహన్ పీలేరు మండల ఉపాధ్యక్షులు, గజేంద్ర పీలేరు మండల ప్రధాన కార్యదర్శి, ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, మున్నా, రాజేష్, షఫీ, కామిశెట్టి సుధాకర్, నరేష్, మోకాటి సుబ్బయ్య, గాలి మహేష్, నక్కా గోపి, కోల్ కోల్ విజయ్ కుమార్, బెజవాడ భాస్కర ,తోట బాలాజీ, మున్నా, రాఘవ, వాయల్పాడు ఎంసీ డైరెక్టర్ దీపాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.1
- ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేసిన పాఠశాల విద్యార్థులు.. పాలసముద్రంమండలంలో వెంగళరాజుకుప్పం ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో,ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి చాలాకాలంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.పాఠశాల ఆవరణలో చిన్నారులు నిత్యం తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.ముఖ్యంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న బావి చుట్టూ తగిన రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు పాఠశాల వెనుక భాగంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రహరి గోడ సైతం కూలిపోవడంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. పాఠశాల పరిసరాల్లోకి చిన్నారులు,ఇతరులు సులభంగా వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యపై ఎమ్మెల్యే స్పందించి,విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న బావిని వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బావిని పూడ్చివేసే చర్యలు చేపట్టారు.ఎంపీడీవో సతీష్ రాజ్,ఎస్సై రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ శ్యామల సహకారంతో, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు,టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వాసు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు.ప్రమాదకర బావిని పూడ్చివేయడంతో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు భద్రత మరింత మెరుగుపడిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.బావిని పూడ్చివేసినప్పటికీ పాఠశాల వెనుక భాగంలో కూలిపోయిన ప్రహరి గోడ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉండటంతో ప్రహరి గోడ లేకపోవడం వల్ల చిన్నారుల భద్రతపై ఆందోళన నెలకొంటోందని తెలిపారు.పాఠశాలకు పూర్తిస్థాయి ప్రహరి గోడ నిర్మించి,విద్యార్థులు భయాందోళన లేకుండా చదువుకునేలా సురక్షిత వాతావరణం కల్పించాలని వారు కోరారు. బావి సమస్యను పరిష్కరించిన విధంగానే కూలిన ప్రహరి గోడను కూడా త్వరగా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.చిన్నారుల భద్రత విషయంలో స్పందించి ప్రమాదకర బావిని పూడ్చివేయించిన ఎమ్మెల్యేకు,సహకరించిన ప్రజాప్రతినిధులు,అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ధన్యవాదాలు తెలిపారు.1
- జనసేన పార్టీ నాయకులతో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. 500 మంది జనసైనికులతో బైక్ ర్యాలీ.. పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ట్రావెల్స్ బంగ్లా వరకు జనసేన నాయకులు 500 మంది జనసేన కార్యకర్తలతో కలసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్బంగా బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి జనసైనికులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు కోలాసోమ శేఖర్,గాజుల నరేష్, చైతన్య, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.4
- మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.2
- తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి2