Shuru
Apke Nagar Ki App…
వర్ధన్నపేటలో సిపిఐ ఇంటింటి నిధి సేకరణ – ప్రజల సహకారం కోరిన నాయకులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వర్ధన్నపేట సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి సాయిలు మాట్లాడుతూ, సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐకి ప్రజలు ఆర్థికంగా సహకరించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సిపిఐ కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
M D Azizuddin
వర్ధన్నపేటలో సిపిఐ ఇంటింటి నిధి సేకరణ – ప్రజల సహకారం కోరిన నాయకులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వర్ధన్నపేట సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి సాయిలు మాట్లాడుతూ, సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐకి ప్రజలు ఆర్థికంగా సహకరించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సిపిఐ కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన అడ్లూరి సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమికి పట్టా కోసం 8 ఏళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫైలు ముందుకు కదలడం లేదని వాపోయారు. 75 ఏళ్ల వృద్ధుడైన ఆయనకు ఆరుగురు సంతానం ఉండగా, వారిలో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేటలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలనే డిమాండ్తో నిరవధిక సమ్మెకు దిగారు. రిజల్ట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విధానంలో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ నుంచి పర్మినెంట్గా మార్పు ప్రక్రియను పారదర్శకంగా, విద్యార్హతలకు అనుగుణంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.2
- గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే వారిపై చేయి చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ సమస్యలను వెలిబుచ్చే హక్కు ఉందని, ముఖ్యంగా రైతులు తమ జీవనాధారానికి సంబంధించిన సమస్యలను ప్రశ్నించడం సహజమని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని విమర్శించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చిరుమర్తి లింగయ్య గారు కోరారు. రైతుల పట్ల గౌరవంతో వ్యవహరించడం ప్రతి నాయకుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.4
- నకిరేకల్: రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యేనే అన్నదాతలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత సిగ్గుచేటని, ఇది అహంకారానికి పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నార్కట్పల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఓ రైతు తాను పండించిన సన్న వడ్లు కొనుగోలు చేయాలని కోరినందుకు సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, అందరూ చూస్తుండగానే సదరు రైతుపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టడం దురదృష్టకరమన్నారు. అంతటితో ఆగకుండా, తనను ఎందుకు కొట్టావని ప్రశ్నించేందుకు కారు వద్దకు వచ్చిన రైతుపై రెండోసారి దాడికి యత్నించి, కాలుతో తన్నబోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై అక్కడున్న రైతులు ఒక్కసారిగా తిరగబడటంతో ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారని (పలాయనం చిత్తగించారని) లింగయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు అడిగిన రైతులపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రైతులపై దాడికి పాల్పడిన వీరేశంను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ ధోరణులను అరికట్టి రైతులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండ్యం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, పల్లె విజయ్, గుర్రం గణేష్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Tagore1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వర్ధన్నపేట సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి సాయిలు మాట్లాడుతూ, సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐకి ప్రజలు ఆర్థికంగా సహకరించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సిపిఐ కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.1