Shuru
Apke Nagar Ki App…
పౌర హక్కుల దినోత్సవం: హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించాలి – ఎస్సై అరుణ్ కుమార్.... నర్సంపేట మున్సిపాలిటీ ముత్తోజిపేటలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు బలమైన ఆధారం అని తెలిపారు. హక్కుల ఉల్లంఘన జరిగితే చట్టపరంగా స్పందించాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Chetty:Ramesh
పౌర హక్కుల దినోత్సవం: హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించాలి – ఎస్సై అరుణ్ కుమార్.... నర్సంపేట మున్సిపాలిటీ ముత్తోజిపేటలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు బలమైన ఆధారం అని తెలిపారు. హక్కుల ఉల్లంఘన జరిగితే చట్టపరంగా స్పందించాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గన్ని సంచులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ అగ్నిప్రమాదానికి గురైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గన్నీ సంచుల లోడుతో బయలుదేరిన ట్రక్, కొత్తగూడెం సమీప అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా మంటలు గాలికి ఎగిరి వాహనంపై పడటంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు గమనించిన డ్రైవర్ భయంతో వాహనాన్ని నియంత్రించలేక చెట్టును ఢీకొట్టడంతో ట్రక్ బోల్తా పడింది. ఎండ వేడి, గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అటుగా వెళ్తున్న వారు సహాయం చేసి గన్ని సంచులను బయటకు తీశారు. అయితే గన్ని సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రక్కు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో డ్రైవర్ సుధాకర్కు స్వల్ప గాయాలు అయ్యాయి.1
- *మీ సొంత మండలంలో డీలర్షిప్ పొందే అవకాశం** మొదటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ గా స్వీకరించింది అనగా మొత్తం 59 జిల్లాలు, 1280 మండలాలు మండల రిసోర్స్ పర్సన్(మండల రిప్రజెంటేటివ్) ఎలాట్మెంట్స్ జరుగుతున్నాయి మీకు, మీ కెరీర్ కు సార్థకత ఇచ్చే బెస్ట్ బిజినెస్ అవకాశం పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి! వేరొకరు మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు!మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి!!! ఎందుకంటే, ఒక మండలానికి ఒకరే రిసోర్స్ పర్సన్!ఉంటారు??? *CONTACT NO:9030818546*💐💐🤝🙏👇👇👇2
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.2
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక అంబులెన్స్కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.1
- ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.3
- తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.1
- ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.2