Shuru
Apke Nagar Ki App…
పచ్చదనంతో కనువిందు చేసే గ్రామం రావిపాడు గ్రామం. రావిపాడు గ్రామం పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉంది. పచ్చటి వాతావరణ పరిస్థితులతో కాలుష్య రహిత వాతావరణంతో, చెట్లు పొలాలు, నడుమ నిర్మింపబడిన గ్రామం రావిపాడు గ్రామం. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. వరి ఇక్కడ ప్రధాన పంట. ప్రస్తుతం వరి కోతలు కూడా ఈ గ్రామంలో పూర్తయ్యాయి. ఈ గ్రామం టిడిపికి కంచుకోట. జీవితంలో ఒకసారైనా ఈ గ్రామాన్ని ప్రకృతి ప్రేమికులు సందర్శించాల్సిందే అని చెప్పక తప్పదు - గోపికృష్ణ పడాల సీనియర్ జర్నలిస్ట్ 9989006977
Gopi krishna Journalist
పచ్చదనంతో కనువిందు చేసే గ్రామం రావిపాడు గ్రామం. రావిపాడు గ్రామం పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉంది. పచ్చటి వాతావరణ పరిస్థితులతో కాలుష్య రహిత వాతావరణంతో, చెట్లు పొలాలు, నడుమ నిర్మింపబడిన గ్రామం రావిపాడు గ్రామం. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. వరి ఇక్కడ ప్రధాన పంట. ప్రస్తుతం వరి కోతలు కూడా ఈ గ్రామంలో పూర్తయ్యాయి. ఈ గ్రామం టిడిపికి కంచుకోట. జీవితంలో ఒకసారైనా ఈ గ్రామాన్ని ప్రకృతి ప్రేమికులు సందర్శించాల్సిందే అని చెప్పక తప్పదు - గోపికృష్ణ పడాల సీనియర్ జర్నలిస్ట్ 9989006977
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Gopi krishna Journalist1
- Post by గెద్దాడ ఈశ్వర్3
- Post by Meenakshi1
- రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవ పై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత లను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన “మే-3 ఛలో ఆకివీడు” పిలుపు నేపథ్యంలో, కాకినాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో వాల్పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో దళితులపై ఒత్తిడి, వివక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రఘురామ కృష్ణం రాజు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మతాల మధ్య విభేదాలు రేకెత్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రం శాంతి, సామరస్యాల తో ముందుకు సాగాలంటే దళితుల హక్కులను కాపాడటం అత్యవసరం అని, అందుకోసం దళితులు, దళిత క్రైస్తవులు, వివిధ దళిత సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మే 3న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో నిర్వహించే “ఛలో ఆకివీడు” కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయాలని, దళితుల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి BSP కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఇందులో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతలు కొండబాబు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తోటి చెంగల్ రావు, మాల మహానాడు నాయకుడు పండు అశోక్ కుమార్, దళిత ప్రజా చైతన్య రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, BSP జిల్లా ఇంచార్జ్ సబ్బారపు ఆప్పారావు, జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు, ట్రెజరర్ సాధన రాజు, అడ్వైజర్ ప్రత్తిపాటి బుల్లి రాజు తో పాటు పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.3
- పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంప గ్రామంలో లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై ఆరా తీస్తూనే.. జనగణన సర్వేకు సహకరించాలని, ఉపాధి హామీ 'జలధార' ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- Post by Master Ameen Shaik1
- మారేడుమిల్లి పందిరి మామిడి కోటలో కేంద్ర కార్యదర్శి కమల్ కిషోర్ సోన్, కలెక్టర్ దినేష్ కుమార్ జల జీవన్ మిషన్ కుళాయిలను ప్రారంభించారు. రూ.15.7 లక్షలతో 98 గిరిజన కుటుంబాలకు రక్షిత నీరు చేరింది. ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల నీరు అందించడమే లక్ష్యమని, దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఇదే వేదికపై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, నీటి సంరక్షణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.1