Shuru
Apke Nagar Ki App…
శ్రీ యోగివేమన ఉత్సవాల్లో మూడవరోజు వైభవంగా ఉట్ల తిరణాల గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు మూడవరోజు వైభవంగా నిర్వహించారు. మంగళవారం మెట్ల తిరుణాల వైభవంగా నిర్వహించారు. ఉట్ల తిరుణాలకు భారీ ఎత్తున పలు ప్రదేశాల నుంచి తిలకించడానికి తరలివచ్చారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి నంద వేమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
Srivartha news
శ్రీ యోగివేమన ఉత్సవాల్లో మూడవరోజు వైభవంగా ఉట్ల తిరణాల గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు మూడవరోజు వైభవంగా నిర్వహించారు. మంగళవారం మెట్ల తిరుణాల వైభవంగా నిర్వహించారు. ఉట్ల తిరుణాలకు భారీ ఎత్తున పలు ప్రదేశాల నుంచి తిలకించడానికి తరలివచ్చారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి నంద వేమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
More news from Sri Sathya Sai and nearby areas
- గాండ్లపెంట కటారుపల్లి గ్రామంలో జరిగిన వేమన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉట్ల తిరుణాల జరిగింది. మద్ది వారిగొంది గ్రామానికి చెందిన సాయికుమార్ నాయుడు టీం సభ్యులు సాధించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేమన ఉట్ల తిరుణాల ఆ గ్రామానికి చెందిన వారే సాధించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేమన భక్తులు యువతకు ప్రశంసించారు. వేమన ఆలయ పీఠాధిపతులు నందవేమారెడ్డి మరి కొంతమంది అర్చకులు యువత పాల్గొన్నారు.1
- *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2
- రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.1
- మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.1
- బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.1
- చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు. ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్లు: పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు మూడవరోజు వైభవంగా నిర్వహించారు. మంగళవారం మెట్ల తిరుణాల వైభవంగా నిర్వహించారు. ఉట్ల తిరుణాలకు భారీ ఎత్తున పలు ప్రదేశాల నుంచి తిలకించడానికి తరలివచ్చారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి నంద వేమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.1