Shuru
Apke Nagar Ki App…
మోడీ జన్మదిన సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగించిన మంత్రి సత్యప్రసాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రధానిగా మరియు ప్రజాప్రతినిధిగా గత 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న విశేష సేవలకు కృతజ్ఞతగా 'ఆశీర్వాద దీపం' వెలిగించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచ వేదికపై భారత్ కీర్తిప్రతిష్టలను పెంచిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, సుదీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని, వారు ఇలాగే దేశ ప్రజలకు సేవలందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
M.Vijay Kishore
మోడీ జన్మదిన సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగించిన మంత్రి సత్యప్రసాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రధానిగా మరియు ప్రజాప్రతినిధిగా గత 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న విశేష సేవలకు కృతజ్ఞతగా 'ఆశీర్వాద దీపం' వెలిగించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచ వేదికపై భారత్ కీర్తిప్రతిష్టలను పెంచిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, సుదీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని, వారు ఇలాగే దేశ ప్రజలకు సేవలందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సముద్ర గర్భంలో మోదీ బర్త్డే సెలబ్రేషన్స్ విశాఖ డైవర్ల వినూత్న విషెస్ 🔹 ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా విశాఖ రుషికొండ తీరంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. సముద్ర గర్భంలో మోదీ చిత్రపటం, శుభాకాంక్షల ప్లకార్డులు ప్రదర్శించిన స్కూబా డైవర్లు ఆకట్టుకున్నారు.1
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1
- పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేటీఆరను చూడాలన్న మణికంఠ కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈనెల 5న వీడియో కాల్లో ఆయనతో మాట్లాడించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మణికంఠ కన్నుమూశాడు.1
- దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.2
- కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ఏసీ మిర్చి, కొత్త పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,125, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర రూ.9,011గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.125, కొత్త పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- పొదిలి మెయిన్ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థం, స్థానికుడు ఇబ్బందులు పొదిలి మెయిన్ రోడ్డు లో డ్రైనేజీ చెత్తాచెదారంతో నిండిపోయి మురుగునీరు ప్రవాహం ఆగిపోయింది. దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో అధికారుల ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీ కాలువలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురుగు నీరు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సమస్య పరిష్కారమైంది.1
- జమ్వాసు గ్రామంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన భూ వివాదం భూ వివాదం నేపథ్యంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన మహారాష్ట్రలోని జమ్వాసు గ్రామంలో జరిగింది. భూ వివాదం ఓ వృద్దురాలి ప్రాణం తీసింది. ప్రత్యర్థులు ముసలావిడ ఉంటున్న ఇంటిని బొలెరో వాహనంతో 4-5 సార్లు గుద్దారు. దీంతో 75 ఏళ్ల సోనాబాయి మఖారం జాదవ్ స్పాట్లోనే చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- ఏపీలో మరో విషాద ఘటన మన్యం జిల్లా అనసభద్రలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతి 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో గుర్తింపు.. హుటాహుటిన డోకిశీల పీహెచ్సీకి తరలింపు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించిన వైద్యులు.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్ులు1