ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బెజ్జూర్ ఆగస్టు 2 (విజయ క్రాంతి) బెజ్జూర్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళ విభాగం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రాచకొండ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు. ఇట్టి వైద్య శిబిరానికి ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి అధిత శిబిరాన్ని సందర్శించారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా మారుమూల ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 274 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మునుముందు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్యవైశ్య సంఘం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్ పాషా, సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి,జిల్లా అధ్యక్షురాలు పూజ, అధ్యక్షురాలు భవాని, ప్రధాన కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మి, కోశాధికారి శ్రీదేవి, అదనపు కార్యదర్శి శ్రీదేవి, మాదంశెట్టి జయలక్ష్మి, సాధన, శారద, నీలిమ, సారిక,తుడూరు సాయిష్మా, డాక్టర్ అంకిత్,శoతను, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ నాయకులు హకీమ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బెజ్జూర్ ఆగస్టు 2 (విజయ క్రాంతి) బెజ్జూర్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళ విభాగం ఆధ్వర్యంలో కొమరం భీం
ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రాచకొండ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు. ఇట్టి వైద్య శిబిరానికి ఏఐసీసీ మహిళా విభాగ కార్యదర్శి అధిత శిబిరాన్ని సందర్శించారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా మారుమూల ప్రాంత పేద ప్రజలకు వైద్య
సేవలు అందించాలని లక్ష్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 274 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మునుముందు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్యవైశ్య సంఘం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్ పాషా, సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి,జిల్లా
అధ్యక్షురాలు పూజ, అధ్యక్షురాలు భవాని, ప్రధాన కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మి, కోశాధికారి శ్రీదేవి, అదనపు కార్యదర్శి శ్రీదేవి, మాదంశెట్టి జయలక్ష్మి, సాధన, శారద, నీలిమ, సారిక,తుడూరు సాయిష్మా, డాక్టర్ అంకిత్,శoతను, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ నాయకులు హకీమ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.1
- వర్షాకాలంలో నీటి కలుషితాన్ని అరికట్టేందుకు బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సక్రు, గ్రామ కార్యదర్శి విశ్వ పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సిబ్బంది బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాల కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర హానికర సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదం ఉండటంతో క్లోరినేషన్ నిర్వహించారు. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని మరిగించి వినియోగించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.1
- కాళేశ్వరం కూళేశ్వరం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాంగ్రెస్ మంత్రులకు గ్రావిటీపై అవగాహన లేదు బీఆర్ఎస్ నేతల ధ్వజం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన 'కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మాజీ ఎంపీ వినోద్కుమార్ మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్వాటర్ను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి మేడారం నంది పంప్హౌజ్, రామడుగు గాయత్రి పంప్హౌజ్ల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి: 140 మీటర్లు మేడారం నంది పంప్హౌజ్: 230 మీటర్లు రామడుగు గాయత్రి పంప్హౌజ్: 331 మీటర్లు రామడుగు వద్ద గాయత్రి పంప్హౌజ్లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్మానేరులోకి నీరు తరలివెళ్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2
- షోషల్ మీడియా లో వైరలావుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్1
- పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం : శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బోరాజ్,జైనథ్,బేలా,సాత్నాల మండలాల్లో ఆదివారం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15లోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ,సమిష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీల ఏర్పాటులో వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, గీమ్మ దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, అక్తర్ అలీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనిల్, బోరాజ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, జైనథ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం జగదీశ్వర్ రెడ్డి, బేలా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూపీరావు, సాత్నాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కినక బాపురావుతో పాటు ఎస్సీ సెల్, మైనారిటీ సెల్, కిసాన్ సెల్, బీసీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.1
- ఆదివాసుల ఆందోళన వద్దకు వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఎమ్మెల్యే బొజ్జు చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు కొట్టి ఇంతవరకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకపు కూడా ఆదివాసులు ఆదివారం రాత్రి మూడు గంటలుగా ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.1
- జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు1
- కరీంనగర్ జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే విషాదం...మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కరీంనగర్ జిల్లాలో స్నేహితుల దినోత్సవం విషాదంగా మారింది. స్నేహితులతో ఆడిపాడిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి రెండు చోట్ల ఇద్దరు పిల్లలు నీట మునిగి మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం పరిధిలో ఎల్ఎండి రిజర్వాయర్ లో స్నేహితులతో కలిసి అలుగునూర్ కు చెందిన గోల్కొండ మణిప్రసాద్(23) ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన 8 ఏళ్ళ బాలుడు రీత్విక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2