Shuru
Apke Nagar Ki App…
వర్క్ ఫ్రం హోం చేయుటకు యువతీ యువకులు కావలెను దీనికి 18 సంవత్సరాలు ఎవరైనా చేయొచ్చు నో క్వాలిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింది ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి
Balakrishna Ch
వర్క్ ఫ్రం హోం చేయుటకు యువతీ యువకులు కావలెను దీనికి 18 సంవత్సరాలు ఎవరైనా చేయొచ్చు నో క్వాలిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింది ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాము1
- పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.1
- అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నట్రాజ్ సెంటర్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ల దాడులు ప్రపంచ శాంతికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం విమర్శించారు. ట్రంప్ను ఒక యుద్ధోన్మాదిగా ఆయన అభివర్ణించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మౌనం వహించడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని, ఇరాన్ నౌక కూల్చివేతను ఖండించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Sampathkumar neerudu1
- ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక విద్యార్థిని చిన్న పొరపాటు కారణంగా ఆందోళనకు గురైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రాన్ని సరిగా చూసుకోకపోవడంతో ఆమె గాజువాక హై స్కూల్ నే తన ఎగ్జామ్ సెంటర్గా భావించి అక్కడికి చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అదే కేంద్రం అనుకుని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే పరీక్షా హాల్లోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా, అది గాజువాక హై స్కూల్ సెంటర్ కాదని, అసలు పరీక్షా కేంద్రం కనితి హై స్కూల్ అని తెలియజేశారు. దీంతో విద్యార్థిని ఒక్కసారిగా కంగారు పడుతూ భయభ్రాంతులకు గురైంది. అప్పటికే పరీక్ష సమయం దగ్గర పడడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థినిని పోలీస్ వాహనంలో సరైన పరీక్షా కేంద్రం అయిన కనితి హై స్కూల్కు సకాలంలో తరలించారు. దీంతో ఆమె సమయానికి పరీక్షకు హాజరయ్యే అవకాశం లభించింది.3
- డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని తన మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.1
- మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,* జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలను కచ్చితంగా అమలుపరచాలని, పరిష్కరించిన ఫైళ్ళ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల అధికారులు, క్షేత్రస్థాయి మండల అధికారులకు సూచించారు, సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల పెన్షన్, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు, *మండల ప్రధాన కార్యాస్థానం నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత ఇనుగుర్తి, గార్ల, డోర్నకల్, కేసముద్రం, చిన్న గూడూరు, తహసిల్దార్లతో భూ సమస్య పరిష్కారం చేయుటకు ఆదేశాలు జారీ చేశారు,* ఈ సోమవారం దంతాలపల్లి మండలం తూర్పు తండ గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోతు నాగమణి తనకు చెందిన భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా భవన నిర్మాణానికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక వర్గం అట్టి భవన నిర్మాణం మరొక స్థలంలో నిర్మించుచున్నారని, ఇట్టి విషయంలో హైకోర్ట్ వారిని సంప్రదించామని, విచారణ చేసి హైకోర్టు నుండి తీర్పు వెలువడే వరకు అట్టి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయకుండా నిలుపుదల చేయమని కోరారు. డోర్నకల్ మండల కేంద్రంలోని యాదవ నగర్ కు చెందిన బొల్లం విజయ తన పేరు మీద మహబూబాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన ఇంటి పట్టా భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసారని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని పరిశీలించి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. నెల్లికుదురు మండలం శ్రీరాం నగర్ గ్రామం శివారు వెంకటాపూరు కు చెందిన బుర్ర కర్ణాకర్ తాను దివ్యాంగుడినని వికలాంగుల స్కూటి ఇప్పించగలరని కోరారు. కురవి మండల కేంద్రానికి చెందిన నిమ్మల భిక్షం తనకు ఉన్న సర్వే నెంబర్ లో గల భూమి రోడ్డు అని చూపిస్తుందని దానిని సరిచేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకము ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వివిధ శాఖలకు సంబంధించి ( 156 ) వచ్చిన దరఖాస్తులకు సంబందిత అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.1
- అమలాపురం మానేపల్లి వారి వీధి లో గోధుమ త్రాచు కలకలం... వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది....కావున ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందిగా కోరుచున్నాం.... ఇట్లు, మీ వర్మ (9949956232)1