సుడా పనుల పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి కొత్త పనులకు టెండర్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ సుడా పనులపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,సుడా వైస్ ఛైర్మన్ మరియు మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కొత్త పనులకు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.సుడా కమర్షియల్ బిల్డింగ్ మొదటి విడత పనులు చివరి దశకు వచ్చాయని ఆది పూర్తి కాగానే మిగతా పనులకు టెండర్లు పిలవాలని రాజీవ్ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం మరియు రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులు ఐడిఎస్ఎంటి మరియు వర్టికల్ గార్డెన్లు తదితర పనులను మే 21 లోగా పూర్తి చేయాలని మే 21 న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులచే ప్రారభించుకుందామని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్,ఈఈ శివానంద్,డిఈఈ లు రాజేంద్ర ప్రసాద్,వెంకటేశ్వర్లు ఎఈఈ లు సతీష్,సతీష్, తదితరులు పాల్గొన్నారు.
సుడా పనుల పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి కొత్త పనులకు టెండర్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ సుడా పనులపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి
నరేందర్ రెడ్డి,సుడా వైస్ ఛైర్మన్ మరియు మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కొత్త పనులకు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.సుడా కమర్షియల్ బిల్డింగ్
మొదటి విడత పనులు చివరి దశకు వచ్చాయని ఆది పూర్తి కాగానే మిగతా పనులకు టెండర్లు పిలవాలని రాజీవ్ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం మరియు రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులు ఐడిఎస్ఎంటి మరియు వర్టికల్ గార్డెన్లు
తదితర పనులను మే 21 లోగా పూర్తి చేయాలని మే 21 న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులచే ప్రారభించుకుందామని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్,ఈఈ శివానంద్,డిఈఈ లు రాజేంద్ర ప్రసాద్,వెంకటేశ్వర్లు ఎఈఈ లు సతీష్,సతీష్, తదితరులు పాల్గొన్నారు.
- ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు అధికార పార్టీ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమ్మెకు సంఘీభావంగా కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో బిజెపి బిఆర్ఎస్ తోపాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ వన్ డిపో ముందు ధర్నాతో బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించి పలువురిని అరెస్టు చేశారు. ఉద్యోగుల సమ్మెలో శాంతియతంగా రాజకీయ పార్టీలు పాల్గొంటే ఎవరికి అభ్యంతరం ఉండదని ధర్నా రాస్తారోకోలతో బస్సులను అడ్డుకోవాలని చూస్తే చట్టపకారం చర్యలు తీసుకోక తప్పదని సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. డిపో ముందు ధర్నాకు దిగిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాతో సహా పలువుర్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఉద్యోగులు శాంతియుత నిరసన ఆందోళన చేస్తే ఎవరికి అభ్యంతరం లేదని రాజకీయ పార్టీలు వచ్చి ఆందోళన చేస్తు బస్సులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరించారు.4
- మూఢనమ్మకాలను నమ్మవద్దని ఎఐఎఫ్టియు నాయకులు సోమిషెట్టి దశరథం అన్నారు.1
- జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు. గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.4
- లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి, రమేష్ చంద్ జైన్, 1వ వార్డ్ కౌన్సిలర్ బుద్ధ సిద్ధార్థ, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న,కోమాకుల రవి, ఎంబడి వెంకటేష్, మోట పలుకుల సతీష్, సంఘ లచ్చన్న, లకావత్ ఈశ్వర్, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, నల్ల ఆనంద్, గౌస్ బాషా, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం1
- జనగాం జిల్లా:పాలకుర్తి మండలం శాతపురం క్రాస్ రోడ్డు వద్ద మొక్కజొన్న కొనుగోలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బస్తాల కొరతతో పాటు లారీలు రాక మండుటెండలో పడిగాపులు కాస్తున్న రైతులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మక్కల రాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందని విమర్శించారు. రైతుబంధు సకాలంలో ఇవ్వకపోవడం, పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండినా కొనుగోలు కేంద్రాలు సరిపడా ప్రారంభం కాలేదని, ఉన్న కేంద్రాల్లో కూడా బస్తాలు, లారీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మద్దతు ధర రూ.2400 ఉండగా రైతులు రూ.1600–1800కే అమ్ముకోవాల్సి వస్తోందని, పక్క రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని, బోనస్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు కరెంటు, రైతుబంధు, బోనస్, మద్దతు ధర ఏదీ అందడం లేదని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.2
- దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం మండలంలోని చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు1
- ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభిస్తుంది. ఓవైపు ఉద్యోగుల సమ్మె చేస్తుంటే మరోవైపు అద్దె బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నిరసన ఆందోళన మధ్య కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా రెండవ రోజు అన్ని డిపోల ముందు ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె బిజెపి బిఆర్ఎస్ తో పాటు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో 980 బస్సులు ఉంటే 50 శాతం బస్సులు నడుస్తున్నాయని అధికారులు ప్రకటించారు. 330 అద్దె బస్సులు, 100 ఎలక్ట్రిక్ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. ఎక్కువ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ల నియామకాల ప్రక్రియ చేపట్టారు. అనుభవం ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెతో ఆందోళన చేస్తుంటే తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం సమ్మెను విచ్చిన్నం చేసేలా ప్రయత్నించడం సమంజసం కాదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమవి గొంతమ్మ కోర్కెలు కాదని, మూడు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. అనుభవం ఉన్నవారిని కాదని తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిచేలా ప్రయత్నిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.3
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1