Shuru
Apke Nagar Ki App…
నల్గొండ: రహదారి మూల మలుపులో గుంత.. వాహనదారులకు ముప్పు నల్గొండ: నల్గొండ పట్టణంలోని శివాజీనగర్–పానగల్ ప్రధాన రహదారిలో రామగిరి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని మూలమలుపు వద్ద ఏర్పడిన గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించకపోతే అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని పట్టణవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.
జిల్లపల్లి ఇంద్ర
నల్గొండ: రహదారి మూల మలుపులో గుంత.. వాహనదారులకు ముప్పు నల్గొండ: నల్గొండ పట్టణంలోని శివాజీనగర్–పానగల్ ప్రధాన రహదారిలో రామగిరి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని మూలమలుపు వద్ద ఏర్పడిన గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించకపోతే అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని పట్టణవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.
More news from Telangana and nearby areas
- నల్గొండ: రహదారి మూల మలుపులో గుంత.. వాహనదారులకు ముప్పు నల్గొండ: నల్గొండ పట్టణంలోని శివాజీనగర్–పానగల్ ప్రధాన రహదారిలో రామగిరి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని మూలమలుపు వద్ద ఏర్పడిన గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతను గుర్తించకపోతే అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని పట్టణవాసులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.1
- హైదరాబాదులోని మల్కాజిగిరి ఎస్వోటీ దాడుల్లో కల్తీ పనీర్ పట్టివేత MDCL: హైదరాబాద్లోని మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు చెర్లపల్లి నుంచి నాగారం తరలిస్తున్న రెండు ఆటోరిక్షాలను తనిఖీ చేసి 300 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు యాదాద్రి జిల్లాకు చెందిన సతీష్, అనిల్కు చెందినదిగా గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.1
- కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.1
- మైనంపల్లి హనుమంతరావు టూ ప్లస్ టు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? ఏనుముల తిరుపతి రెడ్డి, ఏనుముల కొండల్ రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్. ఆమెకు గన్మెన్లను ఇచ్చారు సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమె గన్మెన్లను తీసేశారు జోగు రామన్న మాజీ మంత్రి. ఆయన గన్మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్మెన్లను ఇచ్చారు ఎందుకు? కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు 2+2 గన్మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్ప్రూఫ్ వాహనం ఇచ్చారు జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా? దీని మీద డీజీపీ సమాధానం చెప్పాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1