Shuru
Apke Nagar Ki App…
లంచం అడిగిన అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు...... హైదరాబాద్ నుండి నారాయణఖేడ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
Chetty:Ramesh
లంచం అడిగిన అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు...... హైదరాబాద్ నుండి నారాయణఖేడ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గన్ని సంచులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ అగ్నిప్రమాదానికి గురైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గన్నీ సంచుల లోడుతో బయలుదేరిన ట్రక్, కొత్తగూడెం సమీప అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా మంటలు గాలికి ఎగిరి వాహనంపై పడటంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు గమనించిన డ్రైవర్ భయంతో వాహనాన్ని నియంత్రించలేక చెట్టును ఢీకొట్టడంతో ట్రక్ బోల్తా పడింది. ఎండ వేడి, గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అటుగా వెళ్తున్న వారు సహాయం చేసి గన్ని సంచులను బయటకు తీశారు. అయితే గన్ని సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రక్కు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో డ్రైవర్ సుధాకర్కు స్వల్ప గాయాలు అయ్యాయి.1
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.3
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక అంబులెన్స్కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.1
- ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.3
- నకిరేకల్ 30 :నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తోందని, ఆఖరికి ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వాతావరణ మార్పులతో పంట తడిసిపోతుందేమోనని రైతులు భయాందోళన చెందుతుంటే, స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ధనదాహం తప్ప రైతుల గోడు పట్టడం లేదని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి గింజను మద్దతు ధరతో సేకరించాలని జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగినా లేదా రైతులకు నష్టం కలిగించినా కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగుతామని ఘాటుగా హెచ్చరించారు.1
- తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.2