వడ్ల కొనుగోళ్లలో రాజకీయం తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరిక నకిరేకల్ 30 :నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తోందని, ఆఖరికి ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వాతావరణ మార్పులతో పంట తడిసిపోతుందేమోనని రైతులు భయాందోళన చెందుతుంటే, స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ధనదాహం తప్ప రైతుల గోడు పట్టడం లేదని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి గింజను మద్దతు ధరతో సేకరించాలని జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగినా లేదా రైతులకు నష్టం కలిగించినా కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగుతామని ఘాటుగా హెచ్చరించారు.
వడ్ల కొనుగోళ్లలో రాజకీయం తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరిక నకిరేకల్ 30 :నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తోందని, ఆఖరికి ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వాతావరణ మార్పులతో పంట తడిసిపోతుందేమోనని రైతులు భయాందోళన చెందుతుంటే, స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ధనదాహం తప్ప రైతుల గోడు పట్టడం లేదని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి గింజను మద్దతు ధరతో సేకరించాలని జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగినా లేదా రైతులకు నష్టం కలిగించినా కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగుతామని ఘాటుగా హెచ్చరించారు.
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.1
- Post by Tagore1
- తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్1
- *మీ సొంత మండలంలో డీలర్షిప్ పొందే అవకాశం** మొదటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ గా స్వీకరించింది అనగా మొత్తం 59 జిల్లాలు, 1280 మండలాలు మండల రిసోర్స్ పర్సన్(మండల రిప్రజెంటేటివ్) ఎలాట్మెంట్స్ జరుగుతున్నాయి మీకు, మీ కెరీర్ కు సార్థకత ఇచ్చే బెస్ట్ బిజినెస్ అవకాశం పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి! వేరొకరు మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు!మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి!!! ఎందుకంటే, ఒక మండలానికి ఒకరే రిసోర్స్ పర్సన్!ఉంటారు??? *CONTACT NO:9030818546*💐💐🤝🙏👇👇👇2
- ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్1
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మేడే సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ (ఎన్డీ) పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎరుపు రంగు షర్ట్లు ధరించిన కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా క్రమబద్ధంగా ర్యాలీ నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటారు. నినాదాలతో పట్టణం మార్మోగింది. ర్యాలీ అనంతరం తహశీల్దార్ కార్యాలయం సెంటర్ వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నర్సంపేట మున్సిపాలిటీ ముత్తోజిపేటలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు బలమైన ఆధారం అని తెలిపారు. హక్కుల ఉల్లంఘన జరిగితే చట్టపరంగా స్పందించాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.1
- సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు, రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్, మీడియాతో వివరాలు వెళ్లండి ఇచ్చిన ఏసీబీ డిఎస్పి సుదర్శన్1