Shuru
Apke Nagar Ki App…
కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో వివరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎర్రవెల్లికి వెళ్తున్న దారిలో లక్ష్మాపురం గ్రామంలో కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారు. కేసీఆర్ ఒక పేపర్ ఇచ్చి చదవమంటే కళ్ళు సరిగా కనిపించక చాలా మంది అవస్థపడుతున్నారు. ఒక లక్ష్మాపురంలోనే ఇంతమంది ఉంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత కంటి పరీక్షలు చేపించారన్నారు.
Anji
కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో వివరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎర్రవెల్లికి వెళ్తున్న దారిలో లక్ష్మాపురం గ్రామంలో కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారు. కేసీఆర్ ఒక పేపర్ ఇచ్చి చదవమంటే కళ్ళు సరిగా కనిపించక చాలా మంది అవస్థపడుతున్నారు. ఒక లక్ష్మాపురంలోనే ఇంతమంది ఉంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత కంటి పరీక్షలు చేపించారన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో వివరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎర్రవెల్లికి వెళ్తున్న దారిలో లక్ష్మాపురం గ్రామంలో కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారు. కేసీఆర్ ఒక పేపర్ ఇచ్చి చదవమంటే కళ్ళు సరిగా కనిపించక చాలా మంది అవస్థపడుతున్నారు. ఒక లక్ష్మాపురంలోనే ఇంతమంది ఉంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత కంటి పరీక్షలు చేపించారన్నారు.1
- పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసనలో పాల్గొన్న మల్లు రవి న్యూఢిల్లీ, ఆగస్టు 12: పార్లమెంట్ భవనం వద్ద బుధవారం జరిగిన ప్రతిపక్ష ఎంపీల నిరసన కార్యక్రమంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. వయనాడు ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. విరాళాల సేకరణ, వినియోగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ ఆరోపిత “చందా చోరీ” అంశాన్ని మల్లు రవి ప్రస్తావించారు. అలాగే విద్యార్థులపై పోలీసులు, ఇతర భద్రతా బలగాలచే జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అఘాయిత్యాలపై కూడా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో సమాధానం ఇవ్వాలని, అధికారిక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంటే సరైన వేదిక అని పేర్కొంటూ, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మల్లు రవి తెలిపారు.4
- గ్రామపంచాయతీ పాగుంట గ్రామంలో మురికి నీరు తరిపిస్తున్న పరిశుద్యం పాగుంట గ్రామంలో మడుగులను తలపిస్తున్న మురుగు నీరు పాగుంట గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు సాక్షాత్తూ పంచాయతీ కార్యాలయం ముందే నీరు నిలిచినా చూడని అధికారులు గ్రామసభలో విన్నవించినా కరువైన స్పందన.. గ్రామస్థుల ఆగ్రహం .కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో రోడ్లపై నిలిచిన మురుగునీరుతో మడుగును తలపిస్తోంది. మురుగు నీరుకు తోడు ఇటీవల కురిసిన వర్షం నీరు ముందుకు వెళ్లడానికి వీలులేక రోడ్డుపై నిలిచిపో యింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహన దారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు వెళ్లే సమయంలో సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు పడుతున్నట్టు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజులుగా నీరు ని ల్వ ఉండడంతో దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు ప్ర బలే అవకాశమున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్లపై నిలిచిన మురుగు నీరు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలో వార్డు సభ్యులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని గ్రామస్తులు వాపోతున్నారు.రోజులు తరబడి నిల్వ.. విషజ్వరాల భయం గతకొన్ని రోజులుగా రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడకముందే పారిశుధ్య పనులు చేపట్టి ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు రోడ్డుపై నిలిచిన మురుగునీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలో వార్డు సభ్యులు సైతం ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- కోదండరాం ను సోమాజిగూడ లో నిలదీసిన నిరుద్యోగులు, వీడియో వైరల్ కోదండరాంను పరిగెత్తించిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు1
- సామాజిక విప్లవ యోధుడి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన నివాళులు సామాజిక విప్లవ యోధుడు,అమరజీవి ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పాలమూరు గడ్డపై భూస్వామ్య పెత్తనానికి,అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని పేర్కొన్నారు. పేద ప్రజల భూమి,భుక్తి,విముక్తి కోసం,బడుగు,బలహీన వర్గాల రాజ్యాధికార సాధన కోసం సత్యమన్న తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.1
- నర్సాపూర్ పట్టణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం.. ... ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి అధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎబివిపి నాయకులు రంజిత్ మోహన్ గారు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగ యాత్ర సందర్భంగా 500 అడుగుల జాతీయ పతకంతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ సిగ్నల్ పాయింట్ నుండి తిరిగి మళ్ళీ సిగ్నల్ పాయింట్ వరకు ఘనంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడుతూ నేడు విద్యార్థులందరూ త్రివర్ణ పతాక చేతపట్టి నర్సాపూర్ పట్టణంలో విజయవంతంగా ఈ ర్యాలీని జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం అందరం మన యొక్క ఇంటి పైన కుటుంబ సభ్యులతో జాతీయ జెండాను ఎగురవేసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో భారత దేశం యొక్క గొప్పతనని చాటి చెప్పాల్సిన అవసరం మన అందరిది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థినీ విద్యార్థులకు టీచర్లకు ప్రెస్ రిపోర్టర్లకు పోలీస్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ భుచేష్ యాదవ్, సీనియర్ నాయకులు పంజా విజయ్ కుమార్, నర్సాపూర్ కౌన్సిలర్ నిరంజన్ దాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్, నారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శులు అశోక్ సాదుల, ఎరుకల భిక్షపతి, బాదే బాలరాజ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జనార్ధన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండం శంకర్, బిట్ల మహేష్, మండల అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, నీలి నాగేష్, పెద్దపులి రవి, నాగ ప్రభు గౌడ్, నాగేందర్ రెడ్డి, నర్సాపూర్ మండల ప్రధాన కార్యదర్శిలు కోదండ రామిరెడ్డి, సంఘసాని రాజు, యువ మోర్చా జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్, పోతరాజు అనిల్, రాజేష్, చందు, సాయి, చారి, వంశీ, సురేష్, గణేష్, నరేష్, మహేందర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు మోర్చాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.1
- వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఇంట్లో చోరీ పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో మాల అంబటి బిచ్చన్న ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం ఘటనా స్థలానికి వనపర్తి సీఐ రత్నం, ఎస్సై కురుమయ్య చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని నుండి వివరాలు సేకరించి, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కేతేపల్లి గ్రామ ప్రజలు, నాయకులు యువత సహకరించాలని పోలీసులు కోరారు.4