Shuru
Apke Nagar Ki App…
వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఇంట్లో చోరీ పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో మాల అంబటి బిచ్చన్న ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం ఘటనా స్థలానికి వనపర్తి సీఐ రత్నం, ఎస్సై కురుమయ్య చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని నుండి వివరాలు సేకరించి, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కేతేపల్లి గ్రామ ప్రజలు, నాయకులు యువత సహకరించాలని పోలీసులు కోరారు.
A Rajasheker
వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఇంట్లో చోరీ పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో మాల అంబటి బిచ్చన్న ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం ఘటనా స్థలానికి వనపర్తి సీఐ రత్నం, ఎస్సై కురుమయ్య చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని నుండి వివరాలు సేకరించి, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కేతేపల్లి గ్రామ ప్రజలు, నాయకులు యువత సహకరించాలని పోలీసులు కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.2
- అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు1
- కర్నూలు-ఆదోని మార్గంలో బస్సుల కొరత...ఇదీ పరిస్థితి...! కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. చాలాసేపటి తర్వాత ఒక్క బస్సు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కడానికి గుంపులుగా ఎగబడ్డారు. బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరారు. కర్నూలు-ఆదోని మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.1
- కోదండరాం ను సోమాజిగూడ లో నిలదీసిన నిరుద్యోగులు, వీడియో వైరల్ కోదండరాంను పరిగెత్తించిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు1
- సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..! మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్ సర్కార్లో రైతులకు తప్పని యూరియా కష్టాలు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.1
- సామాజిక విప్లవ యోధుడి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన నివాళులు సామాజిక విప్లవ యోధుడు,అమరజీవి ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పాలమూరు గడ్డపై భూస్వామ్య పెత్తనానికి,అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని పేర్కొన్నారు. పేద ప్రజల భూమి,భుక్తి,విముక్తి కోసం,బడుగు,బలహీన వర్గాల రాజ్యాధికార సాధన కోసం సత్యమన్న తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.1
- కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి1
- హైదరాబాద్ లొ కంటి వెలుగు పథకానికి అలా బీజం పడింది: కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో కేసీఆర్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. వారికి ఓ పేపర్ ఇచ్చి చదవమని కోరగా, కళ్ల చూపు సరిగా లేక చాలామంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఒక్క లక్ష్మాపురం గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించిన కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. అదే ఆలోచనతో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.1
- నిరుద్యోగుల ఆగ్రహం: కోదండరాంను నిలదీసిన వైనం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అడ్డుకున్నారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇప్పుడు మా సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 30 ఏళ్లకు ఉద్యోగాలకు పనికిరామా అంటూ నిలదీయడంతో, ఆయన సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.1