బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా *బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా అర్థరాత్రి 2 గం.లకు అందిన సమాచారంపై స్పందన వెల్దుర్తి, మే 11: వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా గారు సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు. రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు అర్ధరాతి 2 గంటలకు సమాచారం అందుకున్న ఇంచార్జ్ కలెక్టర్, వెంటనే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్ మరియు చైల్డ్లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండడం తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులు, ఇందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా *బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా అర్థరాత్రి 2 గం.లకు అందిన సమాచారంపై స్పందన వెల్దుర్తి, మే 11: వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా గారు సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు. రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు అర్ధరాతి 2 గంటలకు సమాచారం అందుకున్న ఇంచార్జ్ కలెక్టర్, వెంటనే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్ మరియు చైల్డ్లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండడం తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులు, ఇందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
- చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం పల్నాడు జిల్లా నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.2
- about yesterday's double header between rcb vs mi and csk vs lsg1
- సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.1
- తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదకూరపాడులో సంబరాలు. పెదకూరపాడు:తమిళనాడులో జోసఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కై ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఆనందపేట నందు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంక్షేమ కోసం అభివృద్ధి బాటలో ముందుకు నడిపేందుకు విజయ్ ముందుంటారని ఆనందపేట వాసులు అన్నారు. తమిళనాడు చరిత్ర ను తిరగరాసి మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయ్యారని వారన్నారు. హనుమంతరావు,యోహాను, ఖాసిం,దావీదు, యువత పాల్గొన్నారు.1